‘‘కలలు చూసినా కన్నులే.. నేడు మోసెనే కన్నీళ్లే’’.. ఆకట్టుకుంటున్న హార్ట్ టచింగ్ సాంగ్..
యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ హీరో హీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధా మోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కొండా విజయ్కుమార్ దర్శకత్వంలో కె.కె.రాధా మోహన్ నిర్మిస్తున్న యూత్ ఎంటర్టైనర్ ‘ఒరేయ్ బుజ్జిగా’.. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ చిత్రం నుండి ‘కలలు చూసినా కన్నులే.. నేడు మోసెనే కన్నీళ్లే’ అనే లిరికిల్ సాంగ్ విడుదల చేసింది చిత్ర యూనిట్.
‘‘కలలు చూసినా కన్నులే.. నేడు మోసెనే కన్నీళ్లే… హాయి పంచినా.. గుండెకే ఓ గాయమయ్యెనే.. ఓహో జంట నడిచినా అడుగులే.. ఒంటరయ్యెనే ఇవ్వాలే.. వెలుగు నిచ్చినా నీడకే మిగిలింది చీకటే’’.. అంటూ అర్థవంతంగా మనసుకు హత్తుకునే ఈ విరహగీతాన్ని కాసర్ల శ్యామ్ రాయగా లేటెస్ట్ సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ అంతే అద్భుతంగా ఆలపించారు. యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మ్యాజికల్ ట్యూన్స్ పాటను మరో రేంజ్కి తీసుకెళ్లాయి. ఈ పాట విడుదలైన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్తో దూసుకెళ్తోంది. యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబా పటేల్, వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ళా, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, డాన్స్: శేఖర్, ఆర్ట్: టి.రాజ్కుమార్, ఫైట్స్: రియల్ సతీష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్, నిర్మాత: కె.కె.రాధా మోహన్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: కొండా విజయ్కుమార్.