సింగర్స్ సునీత, మాళవికలకు కరోనా పాజిటివ్..
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. రోజు రోజుకీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఇక ఇప్పటికే గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. కరోనా ఇప్పుడు తాజాగా మరో ఇద్దరు టాలీవుడ్ సింగర్స్ కరోనా బారిన పడ్డారు.
సునీత, మాళవికలకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయినట్టు రిపోర్టుల్లో తేలింది. ఇటీవలే వీరిద్దరూ ఓ టీవీ ప్రోగ్రామ్లో పాల్గొన్నారు. ఆ సమయంలోనే వారికి ఈ వైరస్ సోకినట్టుగా సమాచారం. అప్పటికే వారిలో కరోనా లక్షణాలు ఉండడంతో టెస్టులు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది.
ప్రస్తుతం వీరు డాక్టర్ల సూచన మేరకు హోం క్వారంటైన్లో ఉండి, చికిత్స తీసుకుంటున్నారు. సునీత, మాళవికలకు పాజిటివ్ అని తెలియగానే పలువురు యాంకర్స్, సింగర్స్ షూటింగులో పాల్గొనడం పట్ల పునరాలోచనలో పడ్డారు.