Sooryavanshi : 2 రోజుల్లో రూ.50 కోట్లు… బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘సూర్యవంశీ’

సెన్సేషనల్ డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరెకెక్కిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సూర్యవంశీ’ అదిరిపోయే రేంజ్‌లో కలెక్షన్స్ రాబడుతోంది..

Sooryavanshi : 2 రోజుల్లో రూ.50 కోట్లు… బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘సూర్యవంశీ’

Sooryavanshi

Sooryavanshi: అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ జంటగా.. సెన్సేషనల్ డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరెకెక్కిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సూర్యవంశీ’.. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవ్‌గణ్, రణ్‌వీర్ సింగ్ అతిథి పాత్రల్లో నటించిన ఈ సినిమా దీపావళి కానుకగా థియేటర్లలోకి వచ్చింది.

Sree Vishnu : ఎన్టీఆర్ ఫ్యాన్‌గా శ్రీ విష్ణు.. గ్రామ వాలంటీర్‌గా హీరోయిన్!

‘సింగం’, ‘సింబా’ లతో సాలిడ్ హిట్స్ కొట్టిన రోహిత్ శెట్టి మళ్లీ కాప్ కథతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారు. నవంబర్ 5న విడుదలైన ‘సూర్యవంశీ’ కేవలం రెండు రోజుల్లోనే 50 కోట్ల క్లబ్‌లోకి ఎంటరైంది. మహారాష్ట్రతో పాటు మిగతా కొన్ని చోట్ల 50 శాతం ఆక్యుపెన్సీతోనే ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం విశేషం.

Jr NTR : ఇట్స్ పార్టీ టైమ్.. తారక్ పిక్స్ వైరల్..

ఫస్ట్ డే 26.29 కోట్లు, సెకండ్ డే 23.85 కోట్లు కలెక్ట్ చేసి, (రెండు రోజులకు 50.14 కోట్లు) సరైన కమర్షియల్ సినిమా వస్తే ఆడియన్స్ ఏ స్థాయిలో ఆదరిస్తారనే విషయం మరోసారి ప్రూవ్ చేసింది. ఓవర్సీస్‌లోనూ భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. మూడో రోజుతో 75 కోట్ల మార్క్ టచ్ చేస్తుందంటున్నారు బాలీవుడ్ ట్రేడ్ వర్గాల వారు.

Puneeth Rajkumar : పుట్టినరోజే పునీత్ చివరి సినిమా