Sooryavanshi : మా సినిమాను థియేటర్లలోనే చూడండి

‘సూర్యవంశీ’ సినిమా దివాళీ కానుకగా నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది..

Sooryavanshi : మా సినిమాను థియేటర్లలోనే చూడండి

Sooryavanshi

Sooryavanshi: అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ జంటగా.. సెన్సేషనల్ డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరెకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సూర్యవంశీ’.. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవ్‌గణ్, రణ్‌వీర్ సింగ్ అతిథి పాత్రల్లో అలరించనున్నారు.

Sooryavanshi

లాక్‌డౌన్ కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు దివాళీ కానుకగా నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు మూవీ టీం. తమ సినిమాను థియేటర్లలలోనే చూడమంటూ వెరైటీగా ప్రచారం చేస్తున్నారు.

Gorkha : వార్ హీరోగా అక్షయ్ కుమార్

ముంబైలోని ఓ మల్టీప్లెక్స్‌లో అక్షయ్, అజయ్, రణ్‌వీర్, కత్రినా, రోహిత్ పాల్గొన్నారు. హీరోలు ముగ్గురు థియేటర్లో తిరుగుతూ.. అన్ని జాగ్రత్తలతో ఇప్పుడు థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకున్నాయని, తప్పకుండా ప్రతి ఒక్కరూ తమ సినిమాను థియేటర్‌కి వచ్చి చూడాలంటూ చేసిన ప్రమోషనల్ వీడియో ఆకట్టుకుంటోంది.