అన్నయ్య ఆరోగ్యం మెరుగవుతోంది..
గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఇటీవల కరోనా వైరస్ సోకడంతో చెన్నైలో ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. చికిత్స అందిస్తున్నామని, అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్గా ఉందని, ఐసీయులోనే ఉంచామని సోమవారం సాయంత్రం డాక్టర్స్ బులెటిన్ విడుదల చేశారు. దీంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే మంగళవారం బాలు సోదరి, ప్రముఖ గాయని ఎస్.పి.శైలజ ఆయన ఆరోగ్యం గురించి ఓ ఆడియో విడుదల చేశారు.
‘‘బాలు అన్నయ్య రోజు రోజుకీ బెటర్ అవుతున్నారు. డాక్టర్స్ ఆయన హెల్త్ డెవలప్మెంట్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు. వెంటిలేషన్ తీసేశారు. ఎకో సిస్టమ్ మాత్రం అలాగే ఉంచారు. నెమ్మదిగా స్పృహలోకి వస్తున్నారు. ప్రపంచమంతా అన్నయ్య ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నారని నాకు తెలుసు. తప్పకుండా అన్నయ్య హ్యాపీగా బయటకు వస్తారు’’.. అని తెలిపారు.