Sai Dharam Tej : తేజ్ కోలుకోవాలంటూ మోకాళ్లతో మెట్లెక్కారు.. వృద్ధుల ఉపవాసం

హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ప్రమాదానికి గురవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు.

Sai Dharam Tej : తేజ్ కోలుకోవాలంటూ మోకాళ్లతో మెట్లెక్కారు.. వృద్ధుల ఉపవాసం

Special Pujas In Actor Sai Dharam Tej Recover Quickly

Actor Sai Dharam Tej : హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ప్రమాదానికి గురవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న దేవాలయంలో సాయిధరమ్ తేజ్‌ కోసం ప్రత్యేక పూజలు చేశారు. మోకాళ్ళతో మెట్లెక్కారు మెగా అభిమానులు. జిల్లా నలుమూలల నుంచి మొక్కులు తీర్చుకోవడానికి ఫ్యాన్స్ తరలివచ్చారు. సాయిధరమ్‌ తేజ్‌ త్వరగా కోలుకోవాలని గోవింద నామస్మరణలతో పూజలు చేశారు.

Read More : Sai Dharam Tej : వాళ్ల మీద కేసు ఫైల్ చెయ్యాలి..

హీరో సాయి ధరమ్‌ తేజ్‌ త్వరగా కోలుకోవాలని విజయవాడలో ప్రార్థనలు నిర్వహించారు. వాంబే కాలనీలోని అమ్మ ప్రేమ ఆదరణ సేవ సంస్థలోని వృద్ధులు. ఆయన క్షేమంగా కోరుకుంటున్నారు. గతంలో ఈ సేవా సంస్థకు వచ్చిన సాయి ధరమ్‌ తేజ్‌.. వృద్ధుల ఆశ్రమాన్ని నిర్మించి.. వారి బాగోగుల కోసం భారీగా విరాళం అందజేశాడు. సాయి వల్లే తాము ఈరోజు ఇలా ఉన్నామంటున్నారు వృద్ధులు. రోడ్డు ప్రమాదానికి గురైన సాయి ధరమ్‌ తేజ్‌.. ఐసీయూలో ఉండటంతో.. ఆశ్రమంలోని వృద్ధులు ఉపవాసం చేస్తూ..ప్రార్థనలు నిర్వహించారు. ఆయన త్వరగా కోలుకుని… మళ్లీ ఆప్యాయంగా పలకరించాలని వృద్ధులు ఆకాంక్షిస్తున్నామన్నారు.

Read More :Sai Dharam Tej : సాయిధరమ్ తేజ్ సేఫ్.. అల్లు అరవింద్ కీలక ప్రకటన 

రోడ్డు ప్రమాదానికి గురైన హీరో సాయిధరమ్‌ తేజ్‌కు అపోలో ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. క్లోజ్ అబ్జర్వేషన్ కోసం ఈ రోజు కూడా ఐసీయూలోనే సాయి ధరమ్‌తేజ్‌ను ఉంచుతారు. మరోసారి పూర్తి స్థాయిలో పరీక్షించిన తర్వాత.. మరోసారి హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని వైద్యులు చెబుతున్నారు.