ఏప్రిల్ 24న శర్వా ‘శ్రీకారం’..

శర్వానంద్, ప్రియాంక మోహన్ జంటగా.. కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్రీకారం’ ఏప్రిల్ 22న విడుదల..

  • Published By: sekhar ,Published On : February 1, 2020 / 10:03 AM IST
ఏప్రిల్ 24న శర్వా ‘శ్రీకారం’..

శర్వానంద్, ప్రియాంక మోహన్ జంటగా.. కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్రీకారం’ ఏప్రిల్ 22న విడుదల..

యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న 29వ సినిమా ‘శ్రీకారం’. కిశోర్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ‘ఇతను మన కేశవుల కొడుకు… పొద్దున్నే పొలం పనికి వెళ్తున్నాడు చూడండి’.. అంటూ ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. శర్వా రైతు పాత్రలో కనిపిస్తున్నాడు.

 

ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేది ప్రకటించారు. శర్వా మరికొందరితో కలిసి పడిపోయిన ఓ పెద్ద చెట్టుకి తాడు కట్టి లాగుతున్న పోస్టర్‌కి ‘పట్టరా పట్టు హైస్సా …ఎత్తరా ఎత్తు హైలెస్సా!! వస్తున్నాం రా హైస్సా.. ఏప్రిల్ 24 న హ్యేలెస్సా’ అనే క్యాప్షన్ ఇస్తూ ఏప్రిల్ 22న ‘శ్రీకారం’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలిపారు.

Image

 రావు రమేష్, ఆమని, సీనియర్ నరేష్, సాయికుమార్, మురళీ శర్మ, సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : మిక్కీ జె. మేయర్, మాటలు : సాయిమాధవ్ బుర్రా, కెమెరా : జె. యువరాజ్, ఎడిటింగ్ : మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్ : అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : హరీష్ కట్టా, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపి ఆచంట, దర్శకత్వం : కిషోర్ బి.