SSMB28: నైజాం రైట్స్‌తో దుమ్ములేపిన మహేష్-త్రివిక్రమ్.. నిజమేనా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో 28వ చిత్రంగా తెరకెక్కుతున్న నెక్ట్స్ ప్రాజెక్టును ఇప్పటికే స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాలో మహేష్ ఓ సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ ఇప్పటికే ముగించుకుని, రెండో షెడ్యూల్‌ను రీసెంట్’గా స్టార్ట్ చేశారు చిత్ర యూనిట్. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా అభిమానులు ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు.

SSMB28: నైజాం రైట్స్‌తో దుమ్ములేపిన మహేష్-త్రివిక్రమ్.. నిజమేనా..?

SSMB28 Nizam Rights Sold For A Bomb Price

SSMB28: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో 28వ చిత్రంగా తెరకెక్కుతున్న నెక్ట్స్ ప్రాజెక్టును ఇప్పటికే స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాలో మహేష్ ఓ సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ ఇప్పటికే ముగించుకుని, రెండో షెడ్యూల్‌ను రీసెంట్’గా స్టార్ట్ చేశారు చిత్ర యూనిట్. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా అభిమానులు ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు.

Loan App Harassment : లోన్ యాప్ వేధింపులకు మరొకరు బలి.. ఫోటోలు మార్ఫింగ్ చేసి భార్యకు పంపడంతో

ఇప్పటికే ఈ సినిమా రెండో షెడ్యూల్ చాలా ఆలస్యం అవడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే చిత్ర యూనిట్ మాత్రం ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ దాదాపు పదకొండేళ్ల తరువాత సెట్ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అప్పుడే లెక్కలు కూడా వేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా నైజాం రైట్స్ భారీ రేటుకు అమ్ముడైనట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా నైజాం రైట్స్‌ను ఏకంగా రూ.50 కోట్లకు చిత్ర యూనిట్ అమ్మినట్లుగా ఫిలిం సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుండి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ మాత్రం రాలేదు. దీంతో ఈ సినిమా నైజాం రైట్స్‍‌పై వస్తున్న వార్తల్లో నిజం ఎంతవరకు ఉందనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.