సుశాంత్‌ది హత్యే.. హాట్ టాపిక్‌‌గా మారిన సుబ్రహణ్య స్వామిట ట్వీట్స్..

  • Published By: sekhar ,Published On : July 30, 2020 / 03:06 PM IST
సుశాంత్‌ది హత్యే.. హాట్ టాపిక్‌‌గా మారిన సుబ్రహణ్య స్వామిట ట్వీట్స్..

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి రోజుకో మలుపు తిరుగుతుంది. రీసెంట్‌గా ఆయన ప్రేయసి, నటి రియా చక్రవర్తిపై ఈ కేసు విషయమై ఎఫ్ఐఆర్ నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఆమె ముంబైలో లేదని, ఎటో వెళ్లిపోయింది అంటూ వార్తలు వచ్చాయి. మొన్నటి వరకు ఇది నెపోటిజం కారణంగా జరిగిన ఆత్మహత్యగా భావిస్తే.. ఇప్పుడు మాజీ కేంద్రమంత్రి సుబ్రహ్మణ్య స్వామి మాత్రం ఇది ఆత్మహత్య కాదు, ఖచ్చితంగా హత్యే అనడానికి ఆధారాలు ఉన్నాయంటూ కొన్ని ప్రూఫ్స్ బయటపెట్టారు.

ఇక సుబ్రహ్మణ్య స్వామి చెబుతున్న దాని ప్రకారం.. సుశాంత్ తన మరణానికి ఉపయోగించిన క్లాత్, అతని మెడపై ఉన్న గుర్తుకు సరిపోకపోవడం, అలాగే అతని శరీరంపై అక్కడక్కడా గాట్లు వంటివి డైరెక్ట్ అనుమానాలకు కారణమైతే, మరణించిన ప్రదేశంలో సీసీటీవీ ఫుటేజ్ మాయమవడం, అలాగే సుశాంత్ ఉన్న రూమ్‌కి చెందిన డూప్లికేట్ కీ మిస్సవడం, సిమ్ కార్డుల మార్పు, సుశాంత్ మేనేజర్ ఆత్మహత్య చేసుకోవడం, పనివాడు తప్పుడు వాంగ్మూలం వంటివి పరోక్షంగా అనుమానాలకు తావిస్తున్నాయని సుబ్రహ్మణ్య స్వామి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే అతనికి ప్రస్తుతం ఫైనాన్సియల్ క్రైసెస్ కూడా ఏమీ లేవు కాబట్టి, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని తెలుస్తుందని స్వామి ప్రకటించారు.

అంతే కాదు ముంబై మూవీ మాఫియా ఈ హత్యను ఒక గొడవ కేసుగా చిత్రీకరించి, ఓ నటిని ఇందులో ఇరికించాలని చూస్తున్నట్లుగా స్వామి మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. సుశాంత్ సింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని 80 శాతం మంది పోలీసులు కోరుతున్నారని కూడా స్వామి తన ట్వీట్‌లో తెలిపారు. మొత్తంగా చూస్తే.. స్వామి చెబుతున్న దాని ప్రకారం ఇది ఖచ్చితంగా హత్యే అయి ఉంటుందనేలా అనుమానాలైతే వస్తున్నాయి.

స్వామి ట్వీట్స్‌తో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులు.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆత్మహత్య కేసులో సీబీఐ దర్యాప్తుకి కూడా అవకాశం లేదని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్రకటించిన తరుణంలో.. సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో ఈ కేసు నిజంగానే మిస్టరీలా మారింది.