Sudheer-Rashmi : ‘ఢీ’ షో నుంచి సుధీర్, రష్మీ అవుట్.. షో చూడం అంటున్న అభిమానులు

'ఢీ' 14వ సీజ‌న్‌ని నెక్స్ట్ వీక్ నుంచి మొదలు పెట్టనున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుద‌ల చేశారు. ఇక టీం లీడర్లుగా హైపర్ ఆది, ‘బిగ్​బాస్’ ఫేమ్ .....

Sudheer-Rashmi :  ‘ఢీ’ షో నుంచి సుధీర్, రష్మీ అవుట్.. షో చూడం అంటున్న అభిమానులు

Sudheer Rashmi

Sudheer-Rashmi :  బుల్లితెరపై టాప్ షోలలో డ్యాన్స్ షో ‘ఢీ’ కూడా ఒకటి. 13 సీజన్ల నుంచి ఈ షో మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఎంతోమంది డ్యాన్సర్లని పరిచయం చేస్తుంది. ఇప్పుడు 14వ సీజన్ ప్రారంభవవుతుంది. అయితే ఆ సంస్థలో వచ్చే అన్ని షోలలో సుధీర్ లేదా రష్మీ లేదా ఇద్దరూ కలిసి ఉండటం జరుగుతుంది. వాళ్ళ వల్లే ఆ షోలు సక్సెస్ అవుతున్నాయి. చాలా మంది సుధీర్, రష్మీ కోసమే ఈ షోలు చూస్తారు. ‘ఢీ’లో కూడా గత కొన్ని సీజన్ల నుంచి టీం లీడర్లుగా ఎవరు వచ్చినా సుధీర్, రష్మీ మాత్రం కచ్చితంగా ఉంటారు. అయితే తాజాగా రిలీజ్ చేసిన ‘ఢీ’ 14వ సీజన్ ప్రోమోలో వాళ్లిద్దరూ లేకపోవడం, వాళ్ళ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉండటంతో చర్చలకు దారి తెస్తుంది.

Manchu Vishnu : షాకింగ్ నిర్ణయం తీసుకున్న విష్ణు.. ఇకపై ‘మా’ కమిటీలో ప్రకాష్‌రాజ్ ప్యానెల్ లేనట్టే

‘ఢీ’ 14వ సీజ‌న్‌ని నెక్స్ట్ వీక్ నుంచి మొదలు పెట్టనున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుద‌ల చేశారు. ‘ఢీ’ 14: డ్యాన్సింగ్ ఐకాన్ అనే పేరుతో ఈ షో ప్ర‌సారం అవ్వబోతుంది. ఈ సీజన్‌లో చాలా మార్పులు చేసిన‌ట్టు తాజాగా విడుద‌లైన ప్రోమో చూస్తుంటే అర్ధ‌మవుతుంది. ఈ సారి ఇందులో నాలుగు టీమ్‌ల‌తో ప్లాన్ చేయనున్నారు. ఢీ జూనియర్స్, ఢీ లేడీస్ స్పెషల్, ఢీ జోడి మరియు ఢీ ఛాంపియన్స్ అనే నాలుగు టీమ్‌లతో ‘ఢీ’ 14షో ఉండబోతుంది. అయితే యాంకర్​గా ప్రదీప్ అలాగే ఉన్నాడు. జడ్జిలలో కేవలం ప్రియమణి, గణేష్ మాస్టర్ మాత్రమే కనిపించారు. ఈ సారి పూర్ణ ఉండకపోవచ్చు అని తెలుస్తుంది. ఇక టీం లీడర్లుగా హైపర్ ఆది, ‘బిగ్​బాస్’ ఫేమ్ అఖిల్ సార్థక్ కనిపించారు. ఈ సారి రష్మీ, సుధీర్ లు లేనట్టు తెలుస్తుంది. అలాగే రష్మీ ప్లేస్ లో మోనాల్ ని తీసుకు రానున్నట్టు సమాచారం. బిగ్ బాస్ లో మోనాల్, అఖిల్ లు ఏ రేంజ్ లో కనెక్ట్ అయ్యారో మనం చూశాం. ఇప్పుడు అదే కెమిస్ట్రీని ఇక్కడ ‘ఢీ’ లో చూపించబోతున్నారని తెలుస్తుంది.

Akhanda : ‘అఖండ’ కోసం అదిరిపోయే కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది ఇతనే..

దీంతో యూట్యూబ్ లో ఈ ప్రోమో కింద రష్మీ-సుధీర్ అభిమానులు సుధీర్, రష్మీ లేని ‘ఢీ’ షోను మేం చూడం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. రష్మీ-సుధీర్ లేకపోతే షో ఎవ్వరూ చూడరని, టిఆర్పి కూడా పడిపోతుందని కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పేది కూడా నిజమే. వాళ్ళిద్దరి వల్లే ఆ ఛానెల్ లో చాలా షోస్ కి టిఆర్పి వస్తుంది. ఇప్పుడు వాళ్ళని పక్కన పెట్టీ కొత్త వాళ్ళతో ప్రయోగం అంటే ఆలోచించాల్సిందే మరి. ఐతే కొంతమంది ఈ ప్రోమోలో లేకపోయినా ఎపిసోడ్ లో ఉండొచ్చేమో అని అంటున్నారు. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే వచ్చే బుధవారం వరకు వెయిట్ చేయాల్సిందే.