సుక్కు డైరెక్షన్..అడవి బాటలో మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ చిత్రం 'మహర్షి'ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. చివరి దశలో ఉన్న 'మహర్షి' పూర్తి అవ్వగానే సుకుమార్ దర్శకత్వంలో మహేష్ మూవీ ఉండబోతుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లుగా సమాచారం అందుతోంది.

  • Published By: veegamteam ,Published On : January 23, 2019 / 07:04 AM IST
సుక్కు డైరెక్షన్..అడవి బాటలో మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ చిత్రం ‘మహర్షి’ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. చివరి దశలో ఉన్న ‘మహర్షి’ పూర్తి అవ్వగానే సుకుమార్ దర్శకత్వంలో మహేష్ మూవీ ఉండబోతుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లుగా సమాచారం అందుతోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ చిత్రం ‘మహర్షి’ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. చివరి దశలో ఉన్న ‘మహర్షి’ పూర్తి అవ్వగానే సుకుమార్ దర్శకత్వంలో మహేష్ మూవీ ఉండబోతుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లుగా సమాచారం అందుతోంది. సుకుమార్ రంగస్థలం బ్లాక్ బస్టర్ సక్సెస్ అయిన నేపథ్యంలో మరోసారి అదే పీరియాడిక్ నేపథ్యంలో మహేష్ బాబుతో సినిమా చేయాలని భావించాడు.

తెలంగాణ రజాకార్ల సమయంలోని కథను మొదట మహేష్ బాబుకు సుకుమార్ చెప్పాడట. కాని రంగస్థలం వచ్చిన వెంటనే తాను కూడా అదే జోనర్ లో చేస్తే బాగుండదని దానికి తోడు చిరంజీవి సైరా కూడా అలాగే ఉండబోతుందనీ రజాకార్ల నేపథ్యంలోని కథను మహేష్ వద్దన్నాడు. దాంతో మహేష్ బాబు కోసం సుకుమార్ కొత్త కథను సిద్దం చేశాడు. ఈసారి కథను అడవి నేపథ్యంలో రెడీ చేశాడట. కథ ఎక్కువగా అడవిలోనే ఉంటుందనీ తెలుస్తోంది. సుకుమార్ చెప్పిన కథకు మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.

సుకుమార్ మహేష్ బాబుల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘వన్’ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. దాంతో ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకుని కథను సిద్దం చేశాడు. ఆంధ్రప్రదేశ్ అడువుల్లో ఈ చిత్రం కథ సాగుతుందని రివేంజ్ థ్రిల్లర్ గా రూపొందబోతున్న ఈ చిత్రం మే లేదా జూన్ లో పట్టాలెక్కించే అవకాశముందని తెలుస్తోంది. మహేష్ 25వ చిత్రం ఏప్రిల్ 25న విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత సుకుమార్ మూవీ పట్టాలెక్కబోతుంది.