‘పాదయోట్టం’ రీమేక్‌లో సుమంత్

2018లో మలయాళంలో మంచి విజయం సాధించిన ‘పాదయోట్టం’ తెలుగు రీమేక్‌‌లో హీరోగా సుమంత్..

  • Published By: sekhar ,Published On : October 30, 2019 / 08:05 AM IST
‘పాదయోట్టం’ రీమేక్‌లో సుమంత్

2018లో మలయాళంలో మంచి విజయం సాధించిన ‘పాదయోట్టం’ తెలుగు రీమేక్‌‌లో హీరోగా సుమంత్..

‘మళ్లీరావా’ సినిమాతో ట్రాక్‌లోకి వచ్చిన సుమంత్.. చిన్న గ్యాప్ తర్వాత తన కొత్త సినిమాను ప్రకటించాడు. ‘ఇదంజగత్’ సరైన టైములో విడుదల చేస్తే బాగానే ఆడేది అని చెప్పిన సుమంత్, ప్రస్తుతం వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు.

బిజు మీనన్ (రణం సినిమాలో విలన్) హీరోగా 2018లో మలయాళంలో మంచి విజయం సాధించిన ‘పాదయోట్టం’ సినిమా తెలుగులో రీమేక్‌ కానుంది. ఇందులో సుమంత్‌ హీరోగా నటించనున్నాడు. విను యజ్ఞ దర్శకత్వంలో ఈస్ట్‌ ఇండియా టాకీస్, ది మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై తమ్మినేని జనార్థన రావు, శర్మ చుక్క నిర్మించనున్నారు.

Read Also : యశ్‌కి చిన్న యశ్ పుట్టాడు!

ఈ సినిమాతో ఐమా హీరోయిన్‌‌గా పరిచయం కానుంది. ‘గ్యాంగ్‌స్టర్‌ కామెడీ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌   డిసెంబర్‌ 15 నుంచి మొదలు కానుంది.. పూర్తి వివరాలు త్వరలో తెలియచేస్తాం’ అని చిత్రబృందం పేర్కొంది. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: రాజ్‌ కుమార్, లైన్‌ ప్రొడ్యూసర్‌: బాలాజీ శ్రీను.