Supreme Court : సర్కారు వారి పాట సారాంశంతో సుప్రీం కోర్ట్ తీర్పు.. వైరల్ చేస్తున్న ఫ్యాన్స్..

అయితే తాజాగా 'సర్కారువారి పాట' సినిమాలో చూపించిన సారాంశం లాగే సుప్రీం కోర్టు ఓ పిటిషన్ పై తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టులో ఓ బ్యాంకు రైతుల నుంచి లోన్ లు...........

Supreme Court : సర్కారు వారి పాట సారాంశంతో సుప్రీం కోర్ట్ తీర్పు.. వైరల్ చేస్తున్న ఫ్యాన్స్..

Mahesh Babu

Sarkaru Vaari Paata :  సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మే 12న ఈ సినిమా రిలీజ్ అవ్వగా రిలీజ్ రోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కలెక్షన్స్ కూడా అదిరే రేంజ్ లో వస్తున్నాయి ఈ సినిమాకి. అయితే ఈ సినిమాలో అప్పు తీసుకుంటే దాన్ని ఎంత బాధ్యతగా తీసుకోవాలి, బ్యాంకులో ఋణం తీసుకొని వాటిని తీర్చలేక రైతులు ఎలా ఆత్మహత్య చేసుకుంటున్నారు, డబ్బున్న వాళ్ళు ఇంకా రుణాలు తీసుకొని ఎలా ఎగ్గొడుతున్నారు అని చూపించారు. పెద్ద పెద్ద వాళ్ళని వదిలేసి రైతుల మీద లోన్లు తీర్చాలి అంటూ బ్యాంకులు దాడి చేయడం, ఇళ్ళు, పొలాలు జప్తు చేయడం లాంటివి చేస్తారు. దీంతో రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది అన్నట్టు సినిమాలో చూపించారు.

 

అయితే తాజాగా ‘సర్కారువారి పాట’ సినిమాలో చూపించిన సారాంశం లాగే సుప్రీం కోర్టు ఓ పిటిషన్ పై తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టులో ఓ బ్యాంకు రైతుల నుంచి లోన్ లు రికవరీ చేయాలంటూ పిటిషియన్ వేసింది. కానీ సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ని కొట్టేసింది. ఈ పిటిషన్ ని కొట్టేస్తూ.. ”ముందు పెద్ద చేపలను పట్టుకున్న తరువాత వారి జోలికి వెళ్లండి. ఇలాంటి పిటిషన్ల వలన రైతుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి” అంటూ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు.

Roja Selvamani : రోజాకి సన్మానం చేసిన జబర్దస్త్ ఆర్టిస్టులు

దీంతో ఈ తీర్పు సంచలనంగా మారింది. ఇక ఈ తీర్పును సర్కారువారి పాట మేకర్స్ మైత్రి మూవీ మేకర్స్ షేర్ చేసి మా సినిమాలో కూడా ఇదే చూపించింది అంటూ పోస్ట్ చేశారు. ఇక మహేష్ ఫ్యాన్స్ అయితే సినిమా ఎఫెక్ట్ అంటూ దానిని రీట్వీట్ చేస్తున్నారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఈ తీర్పు సినిమా చూసి ఇచ్చినా, ఇవ్వకపోయినా రైతులకి మంచి జరిగితే చాలు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.