సుశాంత్ డబ్బుతో రియా పార్టీలు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన బాడీగార్డ్..
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య రోజుకో మలుపు తిరుగుతూ సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తోంది. సుశాంత్ ఆత్మహత్య ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని దేశం మొత్తం కోరుకుంటోంది. సుశాంత్ ఆత్మహ్యతకు రియా చక్రవర్తి కారణమని ఆరోపిస్తూ జూలై 25న సుశాంత్ తండ్రి కేకే సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరికొందరు కూడా రియాపై విమర్శలు గుప్పించారు.
తాజాగా సుశాంత్ బాడీగార్డ్ కూడా రియాపై విమర్శలు చేశాడు. ‘అనారోగ్యం కారణంగా సుశాంత్ ఎక్కువ సమయం నిద్రపోయేవాడు. ఆ సమయంలో రియా చక్రవర్తి, ఆమె తండ్రి, సోదరుడు తమ స్నేహితులను సుశాంత్ అపార్ట్మెంట్కు ఆహ్వానించి పార్టీలు చేసుకునేవారు. సుశాంత్ డబ్బును విచ్చలవిడిగా ఖర్చుపెట్టుకునేవార’ని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
ఇక సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ తీరుపై కూడా సుశాంత్ ఫ్యామిలీ లాయర్ వికాస్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు. జూలై 25 వరకు రియాకు వ్యతిరేకంగా మాట్లాడిన సిద్ధార్థ్.. ఉన్నట్టుండి ప్లేటు ఫిరాయించాడని, ఈ కేసు విషయంలో అతని పాత్రను పోలీసులే బయటపెడతారని వికాస్ ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా ‘జూన్ 29 నుంచి రోజూ వర్కవుట్లు చేయాలి, మెడిటేషన్ చేయాలని సుశాంత్ ముందుగానే ప్రణాళికలు వేసుకున్నాడు. కాబట్టి అతడు భవిష్యత్తు గురించి ఆలోచించాడని అర్ధమవుతోంది’ అంటూ సుశాంత్ సోదరి శ్వేత, సుశాంత్ జూన్ 29 నుంచి ఏమేం పనులు చేయాలో ఓ వైట్బోర్డ్పై రాసిపెట్టుకున్న షేర్ చేశారు.