తలసానితో నిర్మాతలు భేటి.. జూన్ రెండో వారం నుండి షూటింగులకు అనుమతి?

మంత్రి తలసానితో సినీ నిర్మాతలు భేటి అయ్యారు..

  • Published By: sekhar ,Published On : May 5, 2020 / 07:33 AM IST
తలసానితో నిర్మాతలు భేటి.. జూన్ రెండో వారం నుండి షూటింగులకు అనుమతి?

మంత్రి తలసానితో సినీ నిర్మాతలు భేటి అయ్యారు..

లాక్‌డౌన్‌కారణంగా ప్రజలు ఇళ్లలోనే ఉంటున్నారని, వారిని ఎంటర్‌టైన్‌చేసేందుకు టీవీ షూటింగులకు అనుమతులు ఇవ్వాలని సినిమాటోగ్రఫీ శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఇటీవల పలు చానళ్ల ప్రతినిధులు కోరిన సంగతి తెలిసిందే. టీవీ షూటింగులకు తక్కువ సంఖ్యలో సిబ్బంది అవసరం ఉంటుందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తూ షూటింగ్‌లను నిర్వహిస్తామని వారు మంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమపై కరోనా ఎటువంటి ప్రభావం చూపుతుంది, ముందు ముందు ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనే విషయాలపై చర్చించడానికి మంత్రి తలసానితో సినీ నిర్మాతలు భేటి అయ్యారు.

పలు కీలక అంశాలపై వారు చర్చలు జరిపారని సమాచారం. ఈ నేపథ్యంలో జూన్ రెండో వారం నుండి టీవీ మరియు సినిమా షూటింగులకు షరతులతో కూడిన అనుమతులు జారీ చేయనున్నారని సినీ వర్గాల వారి నుంచి సమాచారం అందుతోంది. ముందుగా తక్కువ మంది సిబ్బందితో, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ షూటింగులు జరుపుకోవాలని సినీ ప్రముఖులకు సూచించారట. ఇందుకు తగ్గట్టు దర్శక నిర్మాతలు షెడ్యూల్స్ ప్లాన్స్ చేసుకునే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజు (మే 5) జరుగబోయే క్యాబినెట్ సమావేశం అనంతరం ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశముంది.