Radisson : తప్పుగా ప్రచారం చేస్తున్నారు అంటూ.. రాడిసన్ ఘటనపై స్పందించిన తమన్నా సింహాద్రి..

తమన్నా సింహాద్రి మీడియాతో మాట్లాడుతూ.. ''పబ్‌కి వెళ్లడం తప్పు అన్న విధంగా నిహారికపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎవరో ఒకరు పబ్‌లో తప్పు చేస్తే పబ్‌కి వెళ్లిన అందరిని దొంగల్లాగా...

Radisson : తప్పుగా ప్రచారం చేస్తున్నారు అంటూ.. రాడిసన్ ఘటనపై స్పందించిన తమన్నా సింహాద్రి..

Tamanna

Tamanna Simhadri :  ఇటీవల రాడిసన్ హోటల్‌లో నిర్వహిస్తున్న పబ్‌లో జరిగిన ఘటన అందర్నీ షాక్‌కి గురిచేసింది. అర్ధరాత్రి దాటినా పబ్ నిర్వహించడం, పబ్‌లో డ్రగ్స్ దొరకడం, ఆ పబ్‌లో చాలా మంది ప్రముఖుల పిల్లలు ఉండటంతో ఈ సంఘటన బాగా వైరల్ అయింది. ఆ ప్రముఖుల్లో మెగా డాటర్ నిహారిక కూడా ఉండటంతో సోషల్ మీడియాలలో, యూట్యూబ్‌లో ఈ వార్త బాగా హైలేట్ అవుతుంది. ఈ ఘటనపై ఇప్పటికే చాలా మంది స్పందించగా తాజాగా ప్రముఖ ట్రాన్స్‌జెండర్, బిగ్‌బాస్ కంటెస్టెంస్ట్ తమన్నా సింహాద్రి ఈ ఘటనపై స్పందించింది.

నిహారిక కేవలం పార్టీకి వెళ్లిందని, ఆమెది ఎటువంటి తప్పు లేదని, పోలీసులు చెప్పారని ఇప్పటికే నాగబాబు వీడియో రిలీజ్ చేశారు. అనేక సోషల్ మీడియా పేజీలు, యూట్యూబ్ ఛానల్స్ నిహారిక మెగా ఫ్యామిలీ కావడంతో ఈ వార్తని మరింత పెద్దగా చేసి ఇష్టమొచ్చినట్టు రాస్తున్నాయి. దీంతో నిహారికకి సపోర్ట్‌గా తమన్నా సింహాద్రి మాట్లాడింది.

Naga Chaitanya : తమిళ్ డైరెక్టర్‌తో నాగ చైతన్య ద్విభాషా సినిమా

తమన్నా సింహాద్రి మీడియాతో మాట్లాడుతూ.. ”పబ్‌కి వెళ్లడం తప్పు అన్న విధంగా నిహారికపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎవరో ఒకరు పబ్‌లో తప్పు చేస్తే పబ్‌కి వెళ్లిన అందరిని దొంగల్లాగా చూస్తున్నారు. నిహారిక ఫ్రెండ్ బర్త్‌డే సెలెబ్రేషన్స్ కోసం పబ్‌కి వెళ్ళింది. నిహారిక బర్త్‌డే పార్టీలో ఉంది. అక్కడికి వెళ్లిన అందరిని వదిలేసి నిహారికని టార్గెట్ చేసి మీడియా, యూట్యూబ్‌లో స్టోరీస్ వేస్తున్నారు. నిహారిక డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు చెప్పలేదు. చాలా మంది పారిపోయారు కూడా. నిహారిక ఫ్యామిలీ విషయాలపై, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ అభిమానులుగా ట్రోల్ చేసిన వారిని అడ్డుకుంటాం” అని తెలిపింది.