డెలివరీకొచ్చాడు.. నటి ఫోన్ నెంబర్ మార్కెట్లో పెట్టాడు..

తన ఫోన్ నెంబర్ అడల్ట్ గ్రూప్స్‌లో షేర్ చేసిన వ్యక్తిపై కంప్లయింట్ ఇచ్చిన తమిళనటి గాయత్రి సాయి..

  • Published By: sekhar ,Published On : February 27, 2020 / 12:42 PM IST
డెలివరీకొచ్చాడు.. నటి ఫోన్ నెంబర్ మార్కెట్లో పెట్టాడు..

తన ఫోన్ నెంబర్ అడల్ట్ గ్రూప్స్‌లో షేర్ చేసిన వ్యక్తిపై కంప్లయింట్ ఇచ్చిన తమిళనటి గాయత్రి సాయి..

పోలీసుల ఆశ్రయించిన ప్రముఖ తమిళనటి..
చెన్నై : క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ‘అంజలి’ సినిమాతో బాలనటిగా తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయమై తర్వాత పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు గాయత్రి సాయి. తాజాగా ఈమెను గురించిన వార్త ఒకటి మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా డోమినోస్‌ పిజ్జా డెలివరీ బాయ్‌పై ఆమె బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వివరాళ్లోకి వెళ్తే.. కొద్దిరోజుల క్రితం (ఫిబ్రవరి 9) గాయత్రి డోమినోస్‌‌లో పిజ్జా ఆర్డర్ ఇచ్చారు. ఇంటికి పిజ్జా తీసుకువచ్చిన డెలివరీ బాయ్‌ ఆ తర్వాత ఆమె ఫోన్‌ నెంబర్‌ను వాట్సాప్‌లోని పలు అడల్ట్‌ గ్రూప్స్‌లో షేర్‌ చేశాడు. ఇక అక్కడినుండి ఆమెకు టార్చర్ స్టార్ట్ అయింది. పలువురు ఆమెను వేధిస్తూ వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపడం, కాల్స్ చేయడం ప్రారంభించారు. వేధింపులు తీవ్రతరం కావడంతో ఆగ్రహానికిలోనైన గాయత్రి.. తేనాంపేటలోని మహిళా పోలీస్‌ స్టేషేన్‌లో పిజ్జా డెలివరీ బాయ్‌పై ఫిర్యాదు చేశారు. అలాగే ట్విట్టర్ వేదికగా తనకు ఎదురైన వేధింపులను వివరించారు.

‘‘ఫిబ్రవరి 9న చెన్నైలోని నా ఇంటికి డోమినోస్‌ డెలివరీ బాయ్‌ పిజ్జా తీసుకుని వచ్చాడు. పిజ్జా డెలివరీ చేసే సమయంలో అతడు తాగి ఉన్నాడు. తర్వాత అతను నా ఫోన్‌ నంబర్‌ను పలు అడల్ట్‌ గ్రూప్స్‌లో షేర్‌ చేశాడు. ఇందుకు సంబంధించి యాజమాన్యానికి ఫిర్యాదు చేసినప్పటికీ.. అది పెండింగ్‌లోనే ఉంది. అతను నా నెంబర్‌ షేర్‌ చేయడంతో.. విపరీతమైన ఫోన్‌ కాల్స్‌, వాట్సాప్‌ మెసేజ్‌లు వస్తున్నాయి.. పోలీసులను ఆశ్రయించడమే కరెక్ట్ అనిపించి కంప్లయింట్ చేశాను’’ అని గాయత్రి తెలిపారు. అలాగే పిజ్జా డెలివరీ బాయ్‌ ఫొటోతో పాటు తనకు వస్తున్న వాట్సాప్‌ మెసేజ్‌లను కూడా స్ర్కీన్‌ షాట్స్ తీసి ఆమె ట్విట్టర్‌లో ఉంచారు. గాయత్రి ఫిర్యాదుపై పోలీసులు స్పందిస్తూ.. పిజ్జా డెలివరీ బాయ్‌ను అదుపులోకి తీసుకున్నామని, విచారణ కొనసాగుతుందని వెల్లడించారు.

Tamil actress Gayatri Sai