Dhanush : ధనుష్‌కి సమన్లు జారీ చేసిన తమిళనాడు హైకోర్టు..

ధ‌నుష్ మా కొడుకేనంటూ 2016లో మ‌ధురై మేలూరు కోర్టులో క‌తిసేర‌న్‌, మీనాక్షి దంప‌తులు కేసు వేశారు. సినిమాల‌పై ఆస‌క్తితో ధ‌నుష్ ఇంటి నుంచి...............

Dhanush : ధనుష్‌కి సమన్లు జారీ చేసిన తమిళనాడు హైకోర్టు..

Dhanush

Dhanush :  తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే గతంలో ధనుష్ తమ కొడుకు అంటూ ఓ జంట కోర్టులో కేసు వేయడం, అది నాలుగు సంవత్సరాలు సాగి చివరికి ధనుష్ కే సపోర్ట్ గా ఉండటంతో ఆ కేసుని కొట్టేశారు. అయితే అయిపోయింద‌నుకున్నఈ లీగ‌ల్ ఇష్యూ మ‌ళ్లీ మొదటికొచ్చింది. తాజాగా తమిళనాడు హైకోర్టు ధనుష్ కి సమన్లు జారీ చేసింది.

వివ‌రాల్లోకి వెళితే.. ధ‌నుష్ మా కొడుకేనంటూ 2016లో మ‌ధురై మేలూరు కోర్టులో క‌తిసేర‌న్‌, మీనాక్షి దంప‌తులు కేసు వేశారు. సినిమాల‌పై ఆస‌క్తితో ధ‌నుష్ ఇంటి నుంచి వెళ్లిపోయాడని వారు ఆ కేసులో పేర్కొన్నారు. ధ‌నుష్ బ‌ర్త్ స‌ర్టిఫికేట్‌, ఫిజిక‌ల్ ఐడెంటిఫికేష‌న్‌, 10వ త‌ర‌గ‌తి మెమో కూడా స‌మ‌ర్పించారు. అప్పట్లో ఈ కేసుపై స్పందించిన ధనుష్ వాళ్లెవరో నాకు తెలీదు, డబ్బుల కోసమే ఇలా చేస్తున్నారు. నేను క‌స్తూరి రాజా, విజ‌య ల‌క్ష్మి కుమారుడినే అని తెలిపారు. అయితే కోర్టు ఆదేశాల మేర‌కు ధ‌నుష్ DNA, మెడిక‌ల్ టెస్టులు కూడా చేయించుకున్నారు. ఈ రిపోర్టులు ధ‌నుష్‌కి అనుకూలంగా వ‌చ్చాయి. దీంతో 2020లో మేలూరు కోర్టు ఈ కేసుని కొట్టి వేసింది.

VishwakSen : నన్నెవరూ ఏమి పీకలేరు.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విశ్వక్‌సేన్..

తాజాగా క‌తిసేర‌న్‌, మీనాక్షి దంపతులు మ‌ద్రాస్ హైకోర్టుని ఆశ్ర‌యించారు. మరో సారి ఈ కేసు విచారించాలని కోరారు. ఈ క్ర‌మంలో హీరో ధ‌నుష్‌ని వివ‌ర‌ణ కోరుతూ మ‌ద్రాస్ హై కోర్టు స‌మ‌న్లు జారీ చేసింది. మరి దీనిపై ధనుష్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.