బొమ్మ వేసుకోండి : లక్ష్మీస్ NTRకి ఈసీ గ్రీన్ సిగ్నల్

  • Published By: madhu ,Published On : March 25, 2019 / 07:31 AM IST
బొమ్మ వేసుకోండి : లక్ష్మీస్ NTRకి ఈసీ గ్రీన్ సిగ్నల్

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీకి ఈసీ లైన్ క్లియర్ చేసింది. ఎన్నికల సంఘం అధికారుల ఎదుట హాజరైన నిర్మాత రాకేష్ రెడ్డి.. తన వాదన వినిపించారు. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా సినిమా ఉందంటూ వచ్చిన కంప్లయింట్లపై వివరణ ఇచ్చారు ప్రొడ్యూసర్. మార్చి 25వ తేదీన.. ఈసీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. 

ఈసీ విచారణ తర్వాత.. 2019, మార్చి 29వ తేదీ సినిమా విడుదల ఉంటుందని ప్రకటించారు నిర్మాత రాకేష్ రెడ్డి. మూవీ రిలీజ్ తర్వాత అభ్యంతరాలు ఉంటే.. మళ్లీ వివరణ ఇస్తామని వెల్లడించారాయన. జగన్‌తో బంధుత్వం లేదని.. కేవలం పార్టీ అధినేతగా మాత్రమే పరిచయం అని స్పష్టం చేశారాయన. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రాసిన పుస్తకం ఆధారంగా సినిమా నిర్మించడం జరిగిందని ప్రకటించారు.

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ కు 13 రోజుల ముందు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’  విడుదల కావటంపై టీడీపీ నుంచి అభ్యంతరాలు ఉన్నాయి. సీఎం చంద్రబాబును విలన్‌గా చూపించారంటూ.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటి రాజకీయ సినిమా ఎలా విడుదల చేస్తారని ప్రశ్నిస్తున్నారు టీడీపీ అభిమానులు. దీంతో నిర్మాత రాకేష్ రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని తమకు చూపించాలంటూ నిర్మాత రాకేష్ రెడ్డిని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దీంతో ఆయన ఈసీ ఎదుట హాజరయ్యారు. ప్రస్తుతం లైన్ క్లియర్ కావడంతో మార్చి 29వ తేదీన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా రిలీజ్ కానుంది.