Telugu Film Producer Council Elections : ముగిసిన ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్షన్ పోలింగ్.. ఎంతమంది ఓటు వేసారో తెలుసా?
గత కొంత కాలంగా టాలీవుడ్ నిర్మాత మండలిలో ఎన్నికల కోసం గొడవ జరుగుతున్న సంగతి తెలిసిందే. చివరాఖరికి ఎన్నికలను ప్రకటించగా, నేడు (ఫిబ్రవరి 19) ఈ ఎలక్షన్స్ జరిగాయి. ఉదయం మొదలైన ఎలక్షన్ పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగాయి. అయితే ఈ ఎన్నికలో...
Telugu Film Producer Council Elections : గత కొంత కాలంగా టాలీవుడ్ నిర్మాత మండలిలో ఎన్నికల కోసం గొడవ జరుగుతున్న సంగతి తెలిసిందే. నిర్మాతల మండలి ఎన్నికలు ప్రతి రెండేళ్ళకి ఒకసారి జరగాలి. కానీ కరోనా కారణంగా ఈ ఎలక్షన్స్ వాయిదా పడుతూ వచ్చాయి. ఇక ఇటీవల ఈ ఎన్నికలు నిర్వహించాలి అంటూ చిన్న నిర్మాతలు ధర్నాకి కూడా దిగారు. దీంతో నిర్మాత సి కళ్యాణ్, చిన్న నిర్మాతల మధ్య పెద్ద గొడవే జరిగింది. చివరాఖరికి ఎన్నికలను ప్రకటించగా, నేడు (ఫిబ్రవరి 19) ఈ ఎలక్షన్స్ జరిగాయి.
ఉదయం మొదలైన ఎలక్షన్ పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగాయి. కాగా నిర్మాతల మండలిలో మొత్తం 1134 ఓటర్స్ ఉన్నారు. అయితే ఈ ఎన్నికలో నమోదైన ఓట్లు మాత్రం అందులో సగం మాత్రమే. కేవలం 678 ఓట్లు మాత్రమే పోలైనట్లు సమాచారం. దిల్ రాజు, సి కళ్యాణ్, పోసాని కృష్ణ మురళి, మైత్రి రవి కిరణ్, స్రవంతి రవి కిషోర్, ఠాగూర్ మధు సునీల్ కుమార్ రెడ్డి, నాగబాబు, అశ్వినిదత్ వంటి బడా నిర్మాతలు అంతా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల కౌంటింగ్ కూడా ఇవాళే జరగనుంది. సాయంత్రం 4గంటలకు కౌటింగ్ మొదలు కానుంది.
ఇక ఎన్నికల్లో రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. ఒకటి దిల్ రాజు వర్గం అయితే, మరొకటి సి కళ్యాణ్ వర్గం. ఫిలిం ఛాంబర్ కార్యదర్శిగా నాలుగేళ్లు పనిచేసిన దామోదర ప్రసాద్ కు దిల్ రాజ్ తన మద్దతు ప్రకటిస్తుండగా, సి కళ్యాణ్ తన మద్దతిని జెమిని కిరణ్ కి తెలియజేశాడు. ప్రోగ్రెసివ్ ప్రొడ్యూసర్ ప్యానల్ పేరుతో దామోదర ప్రసాద్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్యానల్ పేరుతో జెమిని కిరణ్ పోటీలో నిలిచారు. ఈ రెండు ప్యానల్ నుంచి ప్రెసిడెంట్, సెక్రటరీ పోస్టులతో పాటు, కమిటీ మెంబర్స్ పోస్టులకు పోటీ చేస్తున్నారు. ఒక ట్రెజరర్ పోస్ట్ కి మాత్రం తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరి ఈ ఎన్నికలో దిల్ రాజుది పై చెయ్యి అవుతుందా? లేదా సి కళ్యాణ్? వేచి చూడాలి.