Drugs Case: పూరి జగన్నాథ్, తరుణ్‌లకు ఊరట.. వారి నమునాల్లో డ్రగ్స్ లేవు

టాలివుడ్ డ్రగ్స్ కేసులో ముఖ్యంగా వినిపించిన సెలబ్రిటీల పేర్లు పూరి జగన్నాథ్, నటుడు తరుణ్. వీరిద్దరి పేర్లు డ్రగ్స్ కేసులో ఎక్కువగా వినిపించాయి.

Drugs Case: పూరి జగన్నాథ్, తరుణ్‌లకు ఊరట.. వారి నమునాల్లో డ్రగ్స్ లేవు

Puri Tarun

Drugs Case: టాలివుడ్ డ్రగ్స్ కేసులో ముఖ్యంగా వినిపించిన సెలబ్రిటీల పేర్లు పూరి జగన్నాథ్, నటుడు తరుణ్. వీరిద్దరి పేర్లు డ్రగ్స్ కేసులో ఎక్కువగా వినిపించాయి. అయితే, వీరిద్దరి నమునాల్లో డ్రగ్స్ లేవని తేల్చేశారు ఎఫ్ఎస్ఎల్. పూరీ, తరుణ్ రక్తం, వెంట్రుకలు, గోళ్లు పరీక్షించిన రాష్ట్ర ఫోరెన్సిక్ లేబొరేటరీ ఎఫ్ఎస్‌ఎల్‌ నివేదికలో వీరి నుంచి సేకరించిన నమూనాల్లో డ్రగ్స్ లేవని స్పష్టం చేసింది.

డ్రగ్స్ కేసులో ఆరోపణలు కారణంగా 2017 జులైలో పూరి జగన్నాథ్, తరుణ్ నుంచి వారు స్వచందంగా ఇవ్వడంతో రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు సేకరించిన ఎక్సైజ్ శాఖ.. డిసెంబరు 8న ఎక్సైజ్‌కు నివేదికలు సమర్పించింది ఎఫ్ఎస్ఎల్. కెల్విన్‌పై ఛార్జ్‌షీట్‌తో పాటు ఎఫ్ఎస్‌ఎల్‌ నివేదిక వివరాలను కోర్టుకు సమర్పించినట్టు ఎక్సైజ్‌ అధికారులు చెప్పుకొచ్చారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వాంగ్మూలాన్ని కూడా ఎక్సైజ్‌శాఖ కోర్టుకు సమర్పించింది.

ఈమేరకు విచారణ చేపట్టిన రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రధాన నిందితుడు కెల్విన్‌కు సమన్లు జారీ చేసింది. డిసెంబరు 9వ తేదీన విచారణకు హాజరు కావాలని కెల్విన్‌ను ఆదేశించింది కోర్టు.