30 రోజులు.. 3 పాన్ ఇండియా సినిమాలు..

30 రోజులు.. 3 పాన్ ఇండియా సినిమాలు..

Three Pan India Movies: 30 రోజులు 3 పాన్ ఇండియా సినిమాలు ఇండియన్ మార్కెట్‌ని షేక్ చెయ్యబోతున్నాయి.. ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదల కానున్న ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చెయ్యబోతున్నాయి.

మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీస్ అయిన ‘కె.జి.యఫ్ 2’, ‘రాధే శ్యామ్’, ‘పుష్ప’ కేవలం 30 రోజుల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ముందుగా రాకింగ్ స్టార్ యశ్, ప్రశాంత్ నీల్ కాంబోలో హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ‘కె.జి.యఫ్ 2’ జూలై 16న హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

K.G.F 2

రెబల్ స్టార్ ప్రభాస్, హాట్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా.. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో గోపికృష్ణా మూవీస్ ప్రై.లి. ‘రెబల్ స్టార్’ డా.యు.వి.కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంస్థలు నిర్మస్తున్న ప్రెస్టీజియస్ ఫిలిం ‘రాధే శ్యామ్’.. జూలై 30న పాన్ వరల్డ్ రేంజ్‌లో విడుదలవుతోంది. ఈ రెండు సినిమాలు రెండు వారాల గ్యాప్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

Radhe Shyam

మరో రెండు వారాల గ్యాప్ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’.. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 13న భారీగా విడుదల కానుంది.

Pushpa