Major: మేజర్ కోసం బరిలోకి ముగ్గురు స్టార్ హీరోలు.. ఎవరో తెలుసా?

యంగ్ హీరో అడివి శేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘మేజర్’ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు....

Major: మేజర్ కోసం బరిలోకి ముగ్గురు స్టార్ హీరోలు.. ఎవరో తెలుసా?

Three Superstar Heroes To Launch Trailer Of Major The Film

Major: యంగ్ హీరో అడివి శేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘మేజర్’ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను ఎన్ఎస్‌జీ కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిస్తోంది మేజర్ చిత్ర యూనిట్. ఇక ఈ సినిమా ముంబై ఉగ్రదాడి నేపథ్యంలో తెరకెక్కుతుండటంతో ఈ సినిమాలో సందీప్ ఉన్నికృష్ణన్ లైఫ్ స్టోరిని ఏ విధంగా చూపించబోతున్నారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు మేజర్ చిత్రంపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో మంచి అంచనాలు క్రియేట్ చేశాయి.

Major: మేజర్ ట్రైలర్ వీక్షించిన డిఫెన్స్ మినిస్టర్

ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను మే 9న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ సినిమా ట్రైలర్‌ను మూడు భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. తాజాగా ఈ ట్రైలర్‌ను ఇండియాలోని ముగ్గురు బిగ్గెస్ట్ స్టార్స్ చేతుల మీదుగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యారు. ఇంతకీ ఆ ముగ్గురు స్టార్స్ ఎవరో తెలుసా.. ఈ సినిమాను తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో తెరకెక్కించింది చిత్ర యూనిట్. దీంతో ఆయా భాషల్లోని ముగ్గురు స్టార్ హీరోల చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. మేజర్ చిత్ర తెలుగు ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు లాంఛ్ చేయనున్నాడు. అటు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చేతుల మీదుగా మేజర్ హిందీ ట్రైలర్ లాంఛ్ కానుంది.

MAJOR : ‘మేజర్’.. విడుదల వాయిదా..

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ చేతుల మీదుగా ఈ చిత్ర మలయాళ ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇలా ఒక ప్రెస్టీజియస్ చిత్రానికి సంబంధించి మూడు భాషల్లో ట్రైలర్‌ను ముగ్గురు స్టార్స్‌తో రిలీజ్ చేయించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. మే 9న సాయంత్రం 4.59 గంటలు మేజర్ చిత్ర ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో అడివి శేష్ సరసన సాయీ మంజ్రేకర్, శోభిత ధూలిపాల హీరోయిన్లుగా నటిస్తుండగా, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శశి కిరన్ తిక్కా ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా, మే 27న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.