టాలీవుడ్ను పట్టిపీడిస్తున్న మహమ్మారి.. మరో టాప్ డైరక్టర్కు కరోనా
”నేనే రాజు నేనే మంత్రి” డైరక్టర్ తేజకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఓ వెబ్ సిరీస్ కోసం ముంబై వెళ్లిన తేజకు అక్కడే ఇన్ఫెక్షన్ సోకినట్లుగా అనుమానిస్తున్నారు. మొన్నటి వరకు బాలీవుడ్ పరిశ్రమలో కలకలం రేపిన కరోనా మహమ్మారి ఇప్పుడు టాలీవుడ్ని పాకడమే కాకుండా వ్యాప్తి భయాందోళనలు సృష్టిస్తోంది. ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమకి సంబంధించి పలువురు ప్రముఖులు కరోనా బారిన పడకుండా తాజాగా ప్రముఖ దర్శకుడు తేజకి కరోనా పాజిటివ్ అని తేలింది.
తేజకి కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో యూనిట్ సభ్యులతో పాటు ఆయన కుటుంబానికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగెటివ్ రాగా ప్రస్తుతం తేజను మాత్రమే ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వెబ్ సిరీస్ షూటింగ్ ఆరంభించిన కొద్దిరోజుల్లోనే డైరక్టర్ కు కరోనా సోకి అంతరాయం కలిగించడంతో యూనిట్ అంతా తేజ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు.
ఇటీవల తేజ కరోనా మహమ్మారి గురించి జాగ్రత్తలు చెబుతూ వీడియో విడుదల చేశారు. ఎప్పుడెప్పుడు చేతులు కడుక్కుని శుభ్రం చేసుకుంటే.. సేఫ్గా ఉంటామో వివరించారు. శానిటైజేషన్ చేసుకుని మార్కెట్ నుంచి తెచ్చిన కూరగాయలను ఎలా శుభ్రం చేసుకోవాలో తేజ సూచనలు ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం బాహుబలి దర్శకుడు రాజమౌళికి కరోనా సోకినట్లు స్వయంగా వెల్లడించారు.
ట్విట్టర్ ద్వారా కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్తూ.. త్వరలోనే యాంటీబాడీస్ డొనేట్ చేసేందుకు రెడీగా ఉంటామని అన్నాడు.