అన్నీ ఉన్నా ఒక్కోసారి అంతే.. : టాలీవుడ్ హీరోస్

  • Published By: Subhan ,Published On : June 14, 2020 / 03:12 PM IST
అన్నీ ఉన్నా ఒక్కోసారి అంతే.. : టాలీవుడ్ హీరోస్

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ (34) ఆత్మహత్యపై హిందీ పరిశ్రమతో పాటు టాలీవుడ్‌ నటులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం ప్రకటిస్తూ పలువురు హీరోలు ట్వీట్ చేస్తున్నారు. ఆత్మకు శాంతి చేకూరాలంటూ దేవుడిని ప్రార్థిస్తున్నారు. పేరు ప్రతిష్టలు, అందం, ఆరోగ్యం ఉన్నప్పటికీ సుశాంత్‌ మానసిక సమస్యలతో అర్ధాంతంగా తనువు చాలించాడని యువ హీరో నిఖిల్‌ సిద్ధార్థ ట్విటర్‌లో పేర్కొన్నారు. 

కఠిన విమర్శలు లేదా ప్రశంసలు కొన్నిసార్లు నటీనటులకు మానసికంగా నష్టం చేకూర్చే అవకాశం ఉందని అన్నారు. సూపర్ స్టార్ మహేశ్ ట్వీట్‌లో.. ‘సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ అకాల మరణ వార్త విని షాక్ అయ్యాను. ప్రతిభావంతుడైన యువకుడు. సుశాంత్‌ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. అతని కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్నాను’అని ట్వీట్‌ చేశారు. 

సుశాంత్ లేడనే వార్త నమ్మలేకపోతున్నానని రాంచరణ్‌ ట్విటర్‌లో విచారం వ్యక్తం చేశారు. ఉన్నత స్థితికి చేరుకున్న ప్రతిభ త్వరగా కనుమరుగైందని విచారం వ్యక్తం చేశారు. ‘సుశాంత్ మరణవార్త విని షాకయ్యాను. అతని ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ అని జూ. ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు. 

ముంబైలోని తన ఇంట్లో సుశాంత్ ఆదివారం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.