నిర్మాత సి.వెంకట్రాజు కన్నుమూత

టాలీవుడ్ సీనియర్ నిర్మాత సి.వెంకట్రాజు చెన్నైలో కన్నుమూశారు..

  • Published By: sekhar ,Published On : March 9, 2020 / 06:30 AM IST
నిర్మాత సి.వెంకట్రాజు కన్నుమూత

టాలీవుడ్ సీనియర్ నిర్మాత సి.వెంకట్రాజు చెన్నైలో కన్నుమూశారు..

తెలుగు సినీ పరిశ్రమను వరుస మరణాలు కలవరపెడుతున్నాయి. ఆదివారం (మార్చి 8) ప్రముఖ సీనియర్ నిర్మాత సి.వెంకట్రాజు (72) చెన్నైలో కన్నుమూశారు. మూడురోజుల క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు.

చిత్తూరు జిల్లా సిద్దిరాజు కండ్రిగ గ్రామంలో 1948 మే 25న చమర్తి నారపరాజు, వెంకటమ్మ దంపతులకు జన్మించారాయన. సిద్దిరాజు కండ్రిగ గ్రామానికే చెందిన గుంటుమడుగు శివరాజుతో(జి.శివరాజు) కలిసి శ్రీ విజయలక్ష్మి ఆర్ట్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకాన్ని స్థాపించారు వెంకట్రాజు. తొలిచిత్రంగా కృష్ణ హీరోగా ‘గూండారాజ్యం’(1989) నిర్మించారు. ఆ తర్వాత ‘టూటౌన్‌ రౌడీ’, ‘నియంత’, ‘అహంకారి’, ‘ఆదర్శం’, ‘ఆరంభం’ వంటి సినిమాలు నిర్మించారు.

ఆ తర్వాత గీత చిత్ర ఇంటర్నేషనల్‌ అనే పతాకాన్ని స్థాపించిన వీరిద్దరూ ‘లేడీబాస్’, ‘పవిత్రబంధం’, ‘పెళ్లి చేసుకుందాం’, ‘శ్రీమతి వెళ్లొస్తా’, ‘ఘర్షణ’, ‘చక్రం’ వంటి పలు విజయవంతమైన సినిమాలు తీశారు. ‘పవిత్రబంధం’ సినిమాకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తమ చిత్రంగా బంగారు నందిని బహూకరించింది. వెంకట్రాజు మరణంపై టాలీవుడ్ ప్రముఖులు, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సంతాపం ప్రకటించారు. సోమవారం (మార్చి 9) వెంకట్రాజు అంత్యక్రియలు చెన్నైలో జరుగనున్నాయి. 

See More :

జస్ట్ టైమ్ గ్యాప్ అంతే.. నేను దిగితే ఢీ కొట్టేదెవరు..

మహిళలు మహా శక్తివంతులు.. మహేష్ బాబు ‘వుమెన్స్ డే’ ట్వీట్

సూపర్ స్టార్ ‘సో క్యూట్’ – ఫుల్ వీడియో సాంగ్