రాజమౌళి చేతిలో టాలీవుడ్ ఫ్యూచర్

  • Published By: Subhan ,Published On : June 13, 2020 / 11:08 AM IST
రాజమౌళి చేతిలో టాలీవుడ్ ఫ్యూచర్

తెలుగు  సినిమా ఇండస్ట్రీ అంతా రాజమౌళి వైపే చూస్తోంది. ఈ స్టార్ డైరెక్టర్ ఏం చేస్తాడో అని ఆశగా, ఆసక్తిగా ఎదురు చూస్తోంది.  ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు సినిమా భవిష్యత్తు రాజమౌళి  షూటింగే మీదే డిపెండ్ అయ్యినట్టు తెలుస్తోంది. రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమా చేసి చూపిస్తేనే గానీ మిగతా వాళ్లెవరూ  సినిమాలు స్టార్ట్ చేసేలా లేరు. మరి వీళ్ల అనుమానాలు తీర్చడానికి రాజమౌళి ఏం చెయ్యబోతున్నారు..?

షూటింగ్స్ చేస్కోడానికి  కండిషన్స్ తో కూడిన పర్మిషన్స్ ఇచ్చింది ప్రభుత్వం. షూటింగ్స్ కి పర్మిషన్ కోసం ప్రభుత్వాల వెంట పడ్డారే కానీ.. ఇప్పటి వరకూ ఒక్కరు కూడా షూటింగ్ స్టార్ట్ చెయ్యలేదు. ఎందుకంటే .. షూటింగ్ ఓన్లీ 40 మందితోనే చెయ్యమని గవర్నమెంట్ కండిషన్. ఇప్పటి వరకూ వందల మందితో షూటింగ్ చేసిన యూనిట్లు ఇప్పుడు ఓన్లీ 40 మందితో అది కూడా ఇండోర్ లోనే.. ఫుల్ ప్రొటెక్షన్ తో భౌతిక దూరం పాటిస్తూ చెయ్యాల్సి ఉంటుంది. 

అసలు అలా షూటింగ్ చెయ్యడం సాధ్యమేనా..? అని అందరూ డౌట్ పడుతుంటే .. భారీ బడ్జెట్ సినిమాలు చేసిన , ప్రజెంట్ 400 కోట్లతో ట్రిపుల్ సినిమా చేస్తున్న రాజమౌళి.. ఈ వారంలోనే మాక్ షూట్ చేసి చూపిస్తా అని సినిమా పెద్దలకు చెప్పారు . ఇప్పటికే షూటింగ్ ఆపేసి 3 నెలలై పోయింది. ఇక ప్రభుత్వ సూచనలతో , జాగ్రత్తలతో షూటింగ్ కి వెళ్లడానికి మేం రెడీగా ఉన్నామంటూ రాజమౌళి రీసెంట్ గా పోస్ట్ కూడా పెట్టారు.

రాజమౌళి టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిస్తున్న ట్రిపుల్ ఆర్ ని 40 మందితో తెరకెక్కిస్తే…అది చూసి మిగతా వాళ్లు కూడా దాన్నే ఫాలో అవుదామని డిసైడ్ అయ్యారు. కానీ ఎంత ట్రై చేసినా 40 మందితో షూటింగ్ సాధ్యం కావట్లేదట రాజమౌళి అండ్ యూనిట్‌కి. ఇలా రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమా షూట్ ఎప్పుడు చేస్తారో..ఎలా చేస్తారో అని ఇండస్ట్రీ మొత్తం ఆశగా ఎదురుచూస్తోంది. 

ఇలా ఒక రకంగా టాలీవుడ్ భవిష్యత్తు రాజమౌళి షూట్ మీదే ఆధారపడిందని చెబుతున్నారు ఇండస్ట్రీ జనాలు .