బడ్జెట్ వరాలు : 12శాతం పరిధిలోకి సినీ ఇండస్ట్రీ

కేంద్రం తాజా నిర్ణయం నేపథ్యంలో దేశంలోని సినిమా నిర్మాతలకు డబ్బు, సమయం భారీగా ఆదా కానున్నాయి.

  • Published By: sekhar ,Published On : February 1, 2019 / 07:05 AM IST
బడ్జెట్ వరాలు : 12శాతం పరిధిలోకి సినీ ఇండస్ట్రీ

కేంద్రం తాజా నిర్ణయం నేపథ్యంలో దేశంలోని సినిమా నిర్మాతలకు డబ్బు, సమయం భారీగా ఆదా కానున్నాయి.

తాత్కాలిక బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం, సినీ పరిశ్రమపై వరాల జల్లు కురిపించింది. సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న వేళ.. కేంద్ర ఆర్థిక మంత్రి పియూష్ గోయల్, సినిమా పరిశ్రమకు సంబంధించిన కీలక ప్రకటన చేశారు. ఇకపై సినీ పరిశ్రమ వర్గాలకు సింగిల్ విండో ద్వారా అనుతులు జారీ చేస్తామని తెలిపారు. దీనివల్ల పర్మిషన్ కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఫిల్మ్ మేకర్లు ఇకపై సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని ఆయన అన్నారు. ఇప్పటివరకూ విదేశీ ఫిల్మ్ మేకర్లకు మాత్రమే ఉన్న ఈ సౌకర్యాన్ని భారతీయులకూ వర్తింపజేస్తున్నామని చెప్పారు.

సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న పైరసీ సమస్యను నిర్మూలించేందుకు సినిమాటోగ్రఫీ చట్టంలో కీలక మార్పులు తీసుకొస్తామని గోయల్ అన్నారు. బాలీవుడ్ సహా వేర్వేరు సినీ పరిశ్రమల వల్ల వేలాది మందికి ఉపాధి లభిస్తోందని చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ థియేటర్ లో ‘యూరీ’ సినిమా చూశాననీ, థియేటర్‌లో సినిమా చూస్తే దొరికే కిక్కు, పైరసీ ప్రింట్ చూడడంలో ఉండదని గోయల్ స్పష్టం చేశారు. గతంలో సినిమా థియేటర్లపై 50 శాతం పన్ను భారం పడేదనీ,  ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని 12 శాతానికి (జీఎస్టీ) తగ్గించిందన్నారు. కేంద్రం నిర్ణయంతో దేశంలోని సినిమా నిర్మాతలకు డబ్బు, సమయం భారీగా ఆదా కానున్నాయి.