డైసీపై ఉపాసన ప్రేమ చూశారా!
లాక్డౌన్ : జంతువులపై ప్రేమ, సంరక్షణ చూపించాల్సిన సమయం ఇదే అంటూ ట్వీట్ చేసిన ఉపాసన..
లాక్డౌన్ : జంతువులపై ప్రేమ, సంరక్షణ చూపించాల్సిన సమయం ఇదే అంటూ ట్వీట్ చేసిన ఉపాసన..
కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నేపథ్యంలో సామాన్యులు, సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సెలబ్స్ తమ రోజువారి పనులతో పాటు ఇష్టమైన పనులు చేస్తూ వాటి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వైఫ్ ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారనే విషయం తెలిసిందే.
ఎప్పటికప్పుడు లేటేస్ట్ అప్డేట్స్, వాటిపై తన అభిప్రాయాలను నెటిజెన్లతో పంచుకుంటుంటారామె. స్వతాహా యానిమల్ లవర్ అయిన ఉపాసన కరోనా సమయంలో చాలా మంది జంతువులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి జంతువులతో ఉండడం అంత ప్రమాదమేమీ కాదని చెబుతూ తన గుర్రం డైసీతో కలిసి తీసుకున్న పిక్స్ షేర్ చేశారు ఉపాసన..
‘‘స్వీయ నిర్బంధమే కానీ, నా డార్లింగ్కి దూరంగా మాత్రం కాదు. జంతువుల పట్ల లవ్, కేరింగ్ చూపించడానికి అసలైన టైమ్ ఇదే. కొంత మంది క్రూరులు ఈ లాక్డౌన్ టైంలో జంతువులను వదిలిపెడుతున్నారు. మీ జంతువుల పట్ల మీరు చూపించే ప్రేమ, సంరక్షణ మీలోని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది’’ అంటూ ట్వీట్ చేశారు మెగా కోడలు. ఉపాసన చేసిన ట్వీట్ భారీగా లైక్స్, షేర్స్తో పాటు కామెంట్స్ కూడా వస్తున్నాయి.
Self isolation doesn’t apply to my darling daisy. This is the best time to show pets, how much u love & care about them. Some cruel people have been abandoning their pets during this time. The love & care u show towards ur pets speaks volumes about ur personality. pic.twitter.com/uqPfYy1HlD
— Upasana Konidela (@upasanakonidela) April 1, 2020