Paytm: ‘మై చాయిస్ మై పేటీఎం’ అంటూ బుల్లితెర నటుల ప్రచారం!
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్థిక లావాదేవీలలో యూపీఐ పేమెంట్స్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యూపీఐ పేమెంట్స్ యాప్స్ లో తీవ్ర పోటీ కూడా నెలకొనగా ఇందులో ప్రధానంగా..
Paytm: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్థిక లావాదేవీలలో యూపీఐ పేమెంట్స్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యూపీఐ పేమెంట్స్ యాప్స్ లో తీవ్ర పోటీ కూడా నెలకొనగా ఇందులో ప్రధానంగా నాలుగైదు యాప్స్ ప్రధాన వాటాలను దక్కించుకుంటున్నాయి. ఇదే సమయంలో ఈ యాప్స్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఒక గతంలో యూపీఏ పేమెంట్స్ లో దూసుకెళ్లిన పేటీఎం ఇప్పుడు మిగతా యాప్స్ కంటే కాస్త వెనకబడింది.
Deepika Padukone: చనిపోవాలనుకున్నా.. అంతలా నరకం అనుభవించా!
ఈ సమస్యని అధిగమించేందుకు ఇప్పుడు పేటీఎం బుల్లితెర నటులతో ప్రచారం చేయించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం బుల్లితెర నటులు నిరుపమ్ పరిటాల, మేఘన లోకేష్, లాస్య మంజునాథ్, అలీ రెజాతో ‘మై చాయిస్ మైపేటీఎం’ అనే ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో ఇది కొనసాగుతుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రధానంగా యూపీఐ నగదు బదిలీలు, పేటీఎం యాప్ను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలపై ఈ ప్రచారంలో అవగాహన కల్పించనున్నట్టు పేర్కొంది.
Big Boss 5: సరయు తొలివారమే ఎలిమినేషన్.. అభిమానులు కోరుకున్నదేనా?
అంతేకాదు వినియోగదారులు పేటీఎంలో తమ బ్యాంకు అకౌంట్ను ఎలా సులభంగా లింక్ చేసుకోవాలి, బ్యాంక్ బ్యాలన్స్ను ఎలా చూసుకోవాలి.. బ్యాంకు ఖాతా నుంచే నేరుగా మొబైల్ నంబర్కు నగదు బదిలీ చేసుకోవడం ఎలా వంటి చాలా విషయాలపై ‘మై చాయిస్ మైపేటీఎం’ ప్రచార కార్యక్రమం ద్వారా అవగాహనా కలిపించనున్నామని పేటీఎం ప్రకటించింది.