మెగా మేనల్లుడు మామూలోడు కాదు – విడుదలకు ముందే..

వైష్ణ‌వ్ తేజ్ ‘ఉప్పెన‌’లోని తొలి పాట ‘నీ క‌న్ను నీలి స‌ముద్రం’కు 10 మిలియ‌న్ వ్యూస్‌.. 

  • Published By: sekhar ,Published On : March 9, 2020 / 07:53 AM IST
మెగా మేనల్లుడు మామూలోడు కాదు – విడుదలకు ముందే..

వైష్ణ‌వ్ తేజ్ ‘ఉప్పెన‌’లోని తొలి పాట ‘నీ క‌న్ను నీలి స‌ముద్రం’కు 10 మిలియ‌న్ వ్యూస్‌.. 

వైష్ణ‌వ్ తేజ్‌, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా, బుచ్చిబాబు సానా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ‘ఉప్పెన’ చిత్రంలోని మొద‌టి పాట‌ను ఇటీవ‌ల స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ రిలీజ్ చేసిన విష‌యం విదిత‌మే. దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూర్చ‌గా ఖ‌వ్వాలీ త‌ర‌హాలో సాగే ‘నీ క‌న్ను నీలి స‌ముద్రం’ అనే ఈ పాట తక్కువ సమయంలోను 10 మిలియ‌న్ వ్యూస్ దాటి, ఇటీవ‌లి కాలంలో బాగా పాపుల‌ర్ అయిన పాట‌ల్లో ఒక‌టిగా నిలిచింది. తొలి సినిమా విడుదలకు ముందే ఈ మెగా మేనల్లుడు సోషల్ మీడియాలో రికార్డ్ క్రియేట్ చేస్తున్నాడు.

హీరోయిన్ కృతి శెట్టిపై త‌న‌కెంత ప్రేమ ఉందో ఈ పాట‌లో వైష్ణ‌వ్ తేజ్ చెప్పే విధానాన్ని అతి సుంద‌రంగా తెలియ‌జేశారు. హిందీ లిరిక్స్‌ను ర‌ఖీబ్ ఆల‌మ్‌, తెలుగు సాహిత్యాన్ని శ్రీ‌మ‌ణి ర‌చించిన ఈ పాట‌ను జావెద్ అలీ, శ్రీ‌కాంత్ చంద్ర అత్యంత అద్భుతంగా ఆల‌పించారు.

ఈ చిత్రంలోని రెండో పాట‌ను సోమ‌వారం (మార్చి 9) విడుద‌ల చేయడానికి చిత్ర బృందం స‌న్నాహాలు చేస్తోంది. ‘ధ‌క్ ధ‌క్ ధ‌క్’ అంటూ సాగే ఈ పాట‌ను సోమ‌వారం సాయంత్రం 4.05 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు నిర్మాత‌లు తెలిపారు.
‘మక్కల్ సెల్వన్’ విజ‌య్ సేతుప‌తి కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా, షామ్‌ద‌త్ సైనుద్దీన్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌తో క‌లిసి మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న ‘ఉప్పెన’ ఏప్రిల్ 2న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

ప్రధాన తారాగణం:
పంజా వైష్ణవ్ తేజ్, విజయ్ సేతుపతి, కృతి శెట్టి, సాయిచంద్, బ్రహ్మాజీ
సాంకేతిక వర్గం:
మ్యూజిక్: దేవి శ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ: షామ్‌ద‌త్ సైనుద్దీన్
ఎడిటర్: నవీన్ నూలి

ఆర్ట్: మౌనిక రామకృష్ణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అనిల్ వై., అశోక్ బి.
సీఈఓ: చెర్రీ
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
కథ, దర్శకత్వం: బుచ్చిబాబు సానా
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్.

See Also | నిర్మాత సి.వెంకట్రాజు కన్నుమూత