నీ నవ్వు ముత్యాల హారం.. నన్ను తీరానికి లాగేటి దారం..

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ‘ఉప్పెన’ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : March 3, 2020 / 01:01 PM IST
నీ నవ్వు ముత్యాల హారం.. నన్ను తీరానికి లాగేటి దారం..

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ‘ఉప్పెన’ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్..

మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ఉప్పెన’.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి సుకుమార్ కూడా నిర్మాణంలో పాలు పంచుకుంటున్నాడు. ఇటీవల విడుదల చేసిన సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ వేవ్ అండ్ విజయ్ సేతుపతి పోస్టర్లకు మంచి స్పందన లభించింది.

ప్రేమికులరోజు సందర్భంగా ఈ సినిమాలో నాయకా నాయికలో పాత్రల పేర్లతో పాటు వారి లుక్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ రిలీజ్ చేశారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ కంపోజ్ చేయగా శ్రీమణి లిరిక్స్ రాశారు. జావేద్ అలీ అద్భుతంగా పాడారు. ‘నీ కన్ను నీలి సముద్రం.. నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం..

నీ నవ్వు ముత్యాల హారం.. నన్ను తీరానికి లాగేటి దారం.. దారం.. నల్లనైన ముంగురులే అల్లరేదో రేపాయిలే.. నువ్వుతప్ప నాకింకో లోకాన్ని లేకుండా కప్పాయిలే.. ఘల్లుమంటే నీ గాజులే.. ఝల్లుమంది నా ప్రాణమే’.. అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది. ప్రేమ, కుటుంబ విలువల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఉప్పెనచిత్రాన్ని 2020 ఏప్రిల్ 2న విడుదల చేయనున్నారు. కెమెరా : శ్యామ్ దత్ సైనుద్దీన్, ఎడిటింగ్ : నవీన్ నూలి, ఆర్ట్ : మౌనిక రామకృష్ణ, ఫైట్స్ : వెంకట్, కొరియోగ్రఫీ : బృంద, ప్రేమ్ రక్షిత్, సీఈఓ : చెర్రీ, సమర్పణ : సుకుమార్, నిర్మాతలు : నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్, సుకుమార్.