Ajith Kumar : కరోనా దెబ్బ.. ‘వలిమై’ని వాయిదా వేసిన బోనీ కపూర్

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. దీంతో చాలా రాష్ట్రాలు కర్ఫ్యూ విధించాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి బరిలోని సినిమాలు వాయిదా వేస్తున్నారు నిర్మాతలు

Ajith Kumar : కరోనా దెబ్బ.. ‘వలిమై’ని వాయిదా వేసిన బోనీ కపూర్

Ajith Kumar

Ajith Kumar : దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. దీంతో చాలా రాష్ట్రాలు కర్ఫ్యూ విధించాయి. మరికొన్ని రాష్ట్రాలైతే లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. కరోనా సినీ పరిశ్రమపై అధిక ప్రభావం చూపుతోంది. ఈ ఏడాదికి సంక్రాంతి రిలీజ్ కావలసిన పెద్ద సినిమాలన్నీ దాదాపు వాయిదా పడ్డాయి. పరిస్థితిలు అనుకూలంగా ఉంటే ఆర్ఆర్ఆర్ మూవీ శుక్రవారం రిలీజ్ కావలసి ఉంది. కానీ కరోనా తీవ్రత పెరుగుతుండటంతో సినిమాలన్నీ వాయిదా వేశారు నిర్మాతలు. ఇక తమిళ్ స్టార్ హీరో నటించిన ‘వలిమై’ సినిమా కూడా వాయిదా పడింది.

చదవండి : Ajith Kumar: నయా ట్రెండ్.. తోకలొద్దు.. నా పేరే నాకు ముద్దు!

‘వలిమై’ నిర్మాత బోనీ కపూర్ తన సినిమా విడుదలను వాయిదా వేశారు. నిజానికి సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 13న విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించినప్పటి నుండే అందరిలోనూ ఇది వాయిదా పడే ఛాన్స్ ఉందనే అనుమానం కలిగింది. తమిళనాడులో రాత్రి కర్ఫ్యూ పెట్టడం, ఆదివారం లాక్ డౌన్ ప్రకటించడంతో సహజంగానే స్టార్ హీరో అజిత్ నటించిన ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతుందని అనుకున్నారు. చివరకు అదే జరిగింది. అయితే రిలీజ్ తేదీపై స్పష్టత ఇవ్వలేదు.. పరిస్థితులు చక్కబడిన తర్వాత మూవీని విడుదల చేస్తామని మాత్రమే తెలిపాడు

చదవండి : Ajith : ఇకపై నన్ను ‘తల’ అని పిలవకండి : అజిత్