మహర్షి మీదే హోప్స్ పెట్టుకున్న వంశీ పైడిపల్లి!

  • Published By: veegamteam ,Published On : May 3, 2019 / 10:37 AM IST
మహర్షి మీదే హోప్స్ పెట్టుకున్న వంశీ పైడిపల్లి!

మహేశ్ బాబుకి మహర్షి 25వ సినిమా కాబట్టి చాలా ఇంపార్టెంట్. మహేశ్ అభిమానులకి మహర్షి ఓ ప్రెస్టిజియస్ మూవీ. కోట్లు ఖర్చుపెట్టారు కాబట్టి నిర్మాతలకి మహర్షి హిట్టవ్వడం ముఖ్యం. కానీ డైరెక్టర్ వంశీ పైడిపల్లికి మహర్షి లైఫ్. మహర్షి మీదే వంశీ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. 2016లో వచ్చిన ఊపిరి సినిమా తర్వాత రెండేళ్లపాటు మరో సినిమా చేయలేదు. తన దెగ్గర స్టోరీ రెడీగా ఉన్నా మహేశ్ బాబు కోసం రెండేళ్లు వెయిట్ చేసి చివరికి మహర్షిని తెరకెక్కించాడు. కేవలం మహర్షి సినిమా కోసమే వంశీ మూడేళ్లు కేటాయించాడు. అందుకే మహర్షి వంశీ పైడిపల్లి కెరీర్ కి చాలా ఇంపార్టెంట్ గా మారింది.

మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వంశీ పైడిపల్లి కాస్త ఎమోషనల్ అయ్యాడు. మూడేళ్ల తర్వాత డైరెక్టర్ గా మళ్లీ స్టేజ్ ఎక్కి మాట్లాడే అవకాశం వచ్చిందన్నాడు. మహర్షి కోసం తానెంత కష్టపడింది డిటేయిల్డ్ గా ఎక్స్ ప్లేన్ చేశాడు. సినిమాకి పనిచేసిన ప్రతిఒక్క టెక్నిషియన్ ని పేరు పేరునా స్టేజ్ మీదికి ఆహ్వానించి కృతజ్ఞతలు తెలిపాడు. ముఖ్యంగా డీఓపీ మోహనన్ కి స్టేజ్ మీదే పాదాభివందనం చేశాడు. హీరోగా మహేశ్ కి మహేశ్ అభిమానులకి ప్రొడ్యూసర్స్ కి మహర్షి సూపర్ హిట్టవ్వడం ఎంత ముఖ్యమో వంశీ పైడిపల్లికి అంతకి రెట్టింపు ముఖ్యం. మరి వంశీ అంచనాల్ని అందుకుంటాడో లేదో చూడాలి.