భాగ్యరాజాను చెప్పుతో కొట్టాలి : రేప్ లకు కారణం మహిళలేనట

ప్రముఖ తమిళ దర్శకుడు, సీనియర్ నటుడు కే భాగ్యరాజా చిక్కుల్లో పడ్డారు. మహిళలను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. రేప్ లు, లైంగిక దాడులకు

  • Published By: veegamteam ,Published On : November 27, 2019 / 06:05 AM IST
భాగ్యరాజాను చెప్పుతో కొట్టాలి : రేప్ లకు కారణం మహిళలేనట

ప్రముఖ తమిళ దర్శకుడు, సీనియర్ నటుడు కే భాగ్యరాజా చిక్కుల్లో పడ్డారు. మహిళలను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. రేప్ లు, లైంగిక దాడులకు

ప్రముఖ తమిళ దర్శకుడు, సీనియర్ నటుడు కే భాగ్యరాజా చిక్కుల్లో పడ్డారు. మహిళలను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. రేప్ లు, లైంగిక దాడులకు మహిళలే కారణం అన్న రీతిలో భాగ్యరాజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మహిళా సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ మహిళా కమిషన్ చైర్మపర్సన్ వాసిరెడ్డి పద్మ ఘాటుగా స్పందించారు.

మహిళలను ఉద్దేశించి భాగ్యరాజా చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. మహిళలను కించపరిచేలా మాట్లాడిన భాగ్యరాజాను చెప్పుతో కొట్టాలన్నారు. భాగ్యరాజా వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. మహిళల గురించి అవమానకరంగా మాట్లాడిన భాగ్యరాజాపై తమిళనాడు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ తమిళనాడు ప్రభుత్వానికి లేఖ రాస్తానన్నారు.

మహిళలపై అత్యాచారాలు, వేధింపులకు మహిళలే కారణమన్నట్టుగా భాగ్యరాజా అన్నారు. ఈ రోజుల్లో మహిళలు ఎప్పుడూ ఫోన్‌లో ఉంటున్నారు. అదే దాడులకు, అత్యాచారాలకు కారణమవుతోందని నోరుపారేసుకున్నారు. మొబైల్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి మహిళలు స్వీయ నియంత్రణ కోల్పోయారని భాగ్యరాజా అభిప్రాయపడ్డారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ‘కరుతుకలై పాతివు సీ’ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

మహిళలపై వేధింపులు, అత్యాచారం కేవలం తప్పిదం మాత్రమే కాదు.. చట్టరీత్యా  నేరం అనే విచక్షణ మరిచి మహిళల అజాగ్రత్త వల్లే పురుషులు తప్పులు చేస్తున్నారని భాగ్యరాజా అన్నారు. ఈ రోజుల్లో మహిళలు ఎప్పుడూ చూసినా  ఫోన్‌లలోనే ఉంటున్నారని.. రెండేసి ఫోన్‌లు, సిమ్‌లు వాడుతున్నారని.. వారిపై ఘోరాలు జరగడానికి ఇదీ ఓ కారణం అన్నారు. మహిళలపై ఆంక్షలు విధించిన సందర్భాల్లో ఇలాంటి నేరాలేవీ జరగలేదన్నారు.

తమిళనాట తీవ్ర సంచలనం రేపిన పొల్లాచ్చి సంఘటనపై స్పందిస్తూ ఇందులో బాలురుపైన మాత్రమే నిందలు వేయడం సరికాదన్నారు. అమ్మాయిలు చేసిన పొరపాటును వాళ్లు ఉపయోగించుకున్నారనీ, వారు అజాగ్రత్తగా ఉన్నందునే ఇలాంటి ఘటనలు జరుతున్నాయని కామెంట్ చేశారు. మగాళ్ల విచ్చలవిడి సంబంధాలను సమర్ధించిన భాగ్యరాజా.. ”పురుషుడు పొరపాటు చేస్తే, సరిదిద్దుకుంటాడు. అదే మహిళలు తప్పు చేస్తే అది చాలా పెద్ద పొరపాటు అవుతుంది. అలాగే పురుషుడికి చిన్నిల్లు (రెండవ భార్య) ఉంటే.. ఆ స్త్రీ సంతోషంగా ఉంటుంది. ఆమెకు డబ్బు, ఆస్తి లభించడంతో పాటూ, మొదటి భార్యకు ఏ కష్టం కలగదు. కానీ ఒక మహిళకు కల్లా కదలన్ (రహస్య ప్రేమికుడు) ఉంటే భర్తల్ని, పిల్లల్ని చంపేస్తున్నారు” అని అన్నారు. రోజూ న్యూస్ పేపర్లలో వస్తున్న కేసులే ఇందుకు నిదర్శనం అన్నారు. మహిళలు పరిమితుల్లో ఉండాలని సూచించారు.