Veera Simha Reddy: వీరసింహుడి ఉగ్రరూపం.. ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్!

దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘వీరసింహారెడ్డి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాతో నందమూరి బాలకృష్ణ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. కాగా, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్.

Veera Simha Reddy: వీరసింహుడి ఉగ్రరూపం.. ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్!

Veera Simha Reddy Locks Time For Trailer Release

Veera Simha Reddy: దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘వీరసింహారెడ్డి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాతో నందమూరి బాలకృష్ణ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. కాగా, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్.

Veera Simha Reddy: వీరయ్య కంటే ఎక్కవ రన్‌టైమ్‌తో వస్తున్న వీరసింహారెడ్డి

ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను జనవరి 8న ఒంగోలులో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండగా, ఈ చిత్ర ట్రైలర్‌ను జనవరి 6న రాత్రి 8.17 గంటలకు రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. ఈ సినిమా ట్రైలర్‌తో వీరసింహుడి ఉగ్రరూపం చూడబోతున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ ట్రైలర్‌తోనే బాలయ్య అన అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించేందుకు రెడీ అవుతున్నాడని చిత్ర యూనిట్ తెలిపింది.

Veera Simha Reddy: ఒంగోలు గడ్డమీదే ‘వీరసింహారెడ్డి’ వేడుక.. చోటు మాత్రమే మారింది..!

మరి ఈ ట్రైలర్‌తో బాలయ్య ఎలాంటి రికార్డులు సెట్ చేస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో బాలయ్య గెటప్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయని, యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించే విధంగా ఉంటాయని చిత్ర యూనిట్ అంటోంది. బాలయ్యతో శ్రుతి హాసన్ కెమిస్ట్రీ ప్రేక్షకులకు సరికొత్తగా అనిపిస్తుందని చిత్రటీమ్ అంటోంది. వీరిద్దరు కలిసి చేసే డ్యాన్స్ స్టెప్పులకు అభిమానులు థియేటర్లలో టాప్ లేపడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.