Vijay Sethupathi: విజయ్ సేతుపతి సాయం.. సీఎం రిలీఫ్ ఫండ్కు రూ. 25లక్షలు
కరోనా సెకండ్ వేవ్ ప్రస్తుతం భారత్లో ఉండగా.. ఆపన్నహస్తం అందించే వ్యక్తుల కోసం ఎదరుచూస్తున్నారు ప్రజలు.. ప్రభుత్వాలు. దక్షిణాది రాష్ట్రం తమిళనాడులో కరోనా కేసులు విపరీతంగా ఉండగా.. రోజువారీ కరోనా కేసులు ప్రస్తుతం 13వేలకు దగ్గరలో ఉన్నాయి.
Vijay Sethupathi: కరోనా సెకండ్ వేవ్ ప్రస్తుతం భారత్లో ఉండగా.. ఆపన్నహస్తం అందించే వ్యక్తుల కోసం ఎదరుచూస్తున్నారు ప్రజలు.. ప్రభుత్వాలు. దక్షిణాది రాష్ట్రం తమిళనాడులో కరోనా కేసులు విపరీతంగా ఉండగా.. రోజువారీ కరోనా కేసులు ప్రస్తుతం 13వేలకు దగ్గరలో ఉన్నాయి. అంతకుముందు ఈ కేసులు 30వేలుగా ఉన్నాయి. కరోనా కారణంగా ప్రస్తుతం తమిళనాడు అంతటా పూర్తి కర్ఫ్యూ నడుస్తుండగా.. ఇటీవల కొన్ని మినహాయింపులు ఇచ్చారు.
ఇదిలా ఉంటే సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా ప్రభుత్వానికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్గా సౌత్ ఇండియన్ స్టార్ హీరో, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తమిళనాడు రాష్ట్రంలో కోవిడ్ బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. విజయ్ సేతుపతి తమిళనాడు ముఖ్యమంత్రి కోవిడ్ రిలీఫ్ ఫండ్కు రూ .25 లక్షలు అందజేశారు. ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ను సచివాలయంలో కలుసిన విజయ్ సేతుపతి ఈ మేరకు చెక్ అందజేశారు.
ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్ హీరోలతో నటిస్తోన్న విజయ్ సేతుపతి, త్వరతో యంగ్టైగర్ ఎన్టీఆర్ సినిమాలో కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లుగా టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఓ పాన్ ఇండియన్ సినిమాను నిర్మించనుండగా ఈ సినిమాలో కీలక పాత్రలో విజయ్ సేతుపతిని సంప్రదించారని టాలీవుడ్లో చర్చ నడుస్తోంది.