Vinaro Bhagyamu Vishnu Katha: ఓటీటీలోకి వచ్చేస్తున్న వినరో భాగ్యము విష్ణు కథ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన రీసెంట్ మూవీ ‘వినరో భాగ్యము విష్ణు కథ’ మంచి అంచనాల మధ్య థియేటర్లలో రిలీజ్ అయ్యింది. మురళి కిషోర్ అబ్బూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక రిలీజ్కు ముందు చేసిన ప్రమోషన్స్తో ఈ సినిమాపై అంచనాలు బాగానే క్రియేట్ అయ్యాయి.
Vinaro Bhagyamu Vishnu Katha: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన రీసెంట్ మూవీ ‘వినరో భాగ్యము విష్ణు కథ’ మంచి అంచనాల మధ్య థియేటర్లలో రిలీజ్ అయ్యింది. మురళి కిషోర్ అబ్బూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక రిలీజ్కు ముందు చేసిన ప్రమోషన్స్తో ఈ సినిమాపై అంచనాలు బాగానే క్రియేట్ అయ్యాయి.
ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లారు. ఇక ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం పర్ఫార్మెన్స్కు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడ్డాయి. అటు గీతా ఆర్ట్స్ బ్యానర్ నుండి ఈ సినిమా రావడంతో సినీ వర్గాల్లో సైతం ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టి కిరణ్ అబ్బవరం కెరీర్లో మంచి కంబ్యాక్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
Vinaro Bhagyamu Vishnu Katha: వినరో భాగ్యము విష్ణు కథ సెన్సార్ పూర్తి.. రన్టైమ్ ఎంతో తెలుసా..?
ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాను మార్చి 25 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు నెట్ఫ్లిక్స్ సిద్ధమవుతోందట. ఇక ఈ సినిమాను నెట్ఫ్లిక్స్తో పాటు ఆహాలోనూ స్ట్రీమింగ్ చేయనున్నారట. కాగా, ఈ సినిమాలో కశ్మీర పరదేశి హీరోయిన్గా నటించగా, చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందించాడు.