Virata Parvam: విరాటపర్వం ప్రెస్ మీట్.. గుండె బరువెక్కిందన్న సాయి పల్లవి!

టాలీవుడ్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘విరాటపర్వం’ నిన్న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కించగా....

Virata Parvam: విరాటపర్వం ప్రెస్ మీట్.. గుండె బరువెక్కిందన్న సాయి పల్లవి!

Virata Paravam Team Press Meet

Virata Parvam: టాలీవుడ్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘విరాటపర్వం’ నిన్న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కించగా, అందాల భామ సాయి పల్లవి, యంగ్ హీరో రానా దగ్గుబాటి ఈ సినిమాలో లీడ్ పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఈ సినిమా టీమ్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత డి.సురేష్ బాబు, సాయి పల్లవి, డైరెక్టర్ వేణు ఉడుగల, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర, కామ్రేడ్ సరళ సోదరుడు మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Virata Parvam: వెన్నెల పుట్టుక.. సాయి పల్లవి డైలాగుకు పూర్తి న్యాయం!

ఈ సందర్భంగా డైరెక్టర్ వేణు ఉడుగల మాట్లాడుతూ.. ‘‘విరాటపర్వం చిత్ర రిలీజ్ అయిన అన్నీ చోట్లా మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా బిగ్ హిట్ టాక్ తెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తున్న తీరుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా.’’ అని అన్నారు. ఇక నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. ‘‘మా బ్యానర్లో మొదటిసారి ఒక అమ్మాయి నిజజీవితంలో జరిగిన సంఘటనలను సినిమాగా తీశాం. మా బుక్ లో ఈ బయోపిక్ ని గర్వంగా రాసుకోవచ్చు. ప్రతి ఇంట్లో ప్రేమ కథలుంటాయి. కొన్ని సరైనవి ఉంటాయి, కొన్ని తప్పుగా ఉంటాయి. కానీ ఇలాంటి ప్రేమకథ మాత్రం మనకు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇక రెగ్యులర్ సినిమా రోజుల్లో ఇది ఒక మంచి సినిమాగా మిగిలిపోతుంది.’’ అని అన్నారు. ‘‘ఇక హీరోయిన్ సాయిపల్లవి వెన్నెల పాత్రను అంగీకరించకపోతే ఈ సినిమానే లేదు. సినిమా వ్యాపారంలో ఒక కళ ఉంది. అది ఏ స్థాయిలో ఉండాలో ప్రజలు నిర్ణయిస్తారు. కొన్ని కళాత్మక సినిమాలు తీయాల్సిన బాధ్యత కూడా మాపై ఉంది. సక్సెస్ పుల్ సినిమాలన్నీ బ్యాడ్ అని చెప్పను.’’ అని సురేష్ బాబు అన్నారు.

Virata Parvam : సాయిపల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. విరాటపర్వంపై ఎఫెక్ట్??

ఇక కామ్రేడ్ సరళ సోదరుడు మోహన్ రావు మాట్లాడుతూ.. ‘‘వేణు ఉడుగుల 4 సంవత్సరాలుగా ఈకథ పై వర్క్ చేశాడు. ఎట్టకేలకు సినిమాను బాగా తెరకెక్కించాడు. సరళ విప్లవం కోసం బతికింది, విప్లవం కోసం పనిచేసింది.’’ అని అన్నారు. హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ.. ‘‘నేను మోహన్ రావుగారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఫ్యామిలీని చూసి నా గుండె బరువెక్కింది. వేణుగారు సరళ కథను ప్రజల వద్దకు చేర్చాలి అని ఎంతో హార్డ్ వర్క్ చేసారు. సురేష్ బాబు గారు సినిమాకు సంబంధించిన అన్ని విషయాలలో ఎంతో కేర్ తీసుకున్నారు. నేను సరళ పాత్ర చెయ్యడం గర్వంగా ఉంది. ఈరోజు వస్తున్న టాక్ మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది.’’ అని అంది.