వాజిద్‌ తల్లికి కరోనా..కుటుంబసభ్యుల్లో ఆందోళన

  • Published By: madhu ,Published On : June 3, 2020 / 02:13 AM IST
వాజిద్‌ తల్లికి కరోనా..కుటుంబసభ్యుల్లో ఆందోళన

ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ (42) కుటుంబసభ్యులకు మరో షాకింగ్ న్యూస్ తెలిసిందే. ఆయన తల్లి రజీనా ఖాన్ కి కరోనా వైరస్ ఉందని వైద్యులు నిర్ధారించారు. వాజిద్ ఖాన్ మృతితో తీవ్ర విషాదంలో మునిగిపోయిన కుటుంబసభ్యులకు ఈ వార్త ఆందోళనకు గురి చేసింది. ముంబైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో రజీనా చికిత్స తీసుకుంటున్నారు. ఈమెకు కరోనా పాజిటివ్ వచ్చిందని, ప్రస్తుతం చికిత్స నిర్వహిస్తున్నారని..ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని వాజిద్ కుటుంబ సన్నిహితులు వెల్లడించారు. 

వాజిద్ ఖాన్ కరోనా వైరస్ తో మృతి చెందాడనే వార్తలు వెలువడుతున్నాయి. అనారోగ్యంతో ఉన్న కొడుకును చూసుకొనేందుకు రజీనా ఆసుపత్రిలోనే ఉన్నారని సమాచారం. బాలీవుడ్ ఫేమస్ సాజిద్ వాజిద్ లలో ఒకరైన వాజిద్ ఖాన్..బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలకు సంగీతం అందించారు. ఆయన సినిమాల్లోని బ్లాక్ బస్టర్ గా నిలిచిన…దబాంగ్, వాంటెడ్, ఏక్తా టైగర్ సినిమాలకు బాణీలు కట్టారు.

సాజిద్ వాజిద్ ద్వయం లాక్ డౌన్ లో ఈద్ సందర్భంగా సల్మాన్ ఖాన్ ‘భాయ్ భాయ’ అంటూ ఓ పాటను విడుదల చేశారు. ఈయన మృతి పట్ల పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు, ఇతరులు సంతాపం తెలియచేశారు. సోషల్ మీడియాలో ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే..వాజిద్ మృతికి అమితాబ్ బచ్చన్,

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, అక్షయ్ కుమార్ తో సహా హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం తెలియచేశారు.  మరోవైపు ముంబైకి చెందిన టీవీ నటి మొహేనా కుమారి సింగ్ తో పాటు ఆమె కుటుంబసభ్యులు ఐదుగురు కరోనా వైరస్ బారిన పడ్డారు. తాము అందరం కోలుకోవాలని కోరుకుంటున్న వారందరికీ ధన్యవాదాలు తెలియచేశారు మొహేనా. 

Read: పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు బాలకృష్ణ అదిరిపోయే గిఫ్ట్