Samantha: విడిపోయిన తర్వాత తొలిసారి సమంత ఏం చెప్పిందంటే?

దశాబ్ధపు స్నేహాన్ని ముగించుకున్నట్లుగా నాగ చైతన్య-సమంత ప్రకటించారు.

Samantha: విడిపోయిన తర్వాత తొలిసారి సమంత ఏం చెప్పిందంటే?

Samantha (1)

Samantha: దశాబ్ధపు స్నేహాన్ని ముగించుకున్నట్లుగా నాగ చైతన్య-సమంత ప్రకటించారు. వారిద్దరి ప్రకటన తర్వాత వారిద్దరూ మౌనంగానే ఉన్నారు. లేటెస్ట్‌గా విడాకుల ప్రకటన తర్వాత సమంత తన సోషల్‌ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రమ్‌లో తనలోని భావాలను పంచుకున్నారు. భార్యా భర్తలుగా విడిపోవడానికి కారణాలు ఇప్పటివరకు వెల్లడించలేదు ఈ జంట.

అయితే, ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఈ ప్రపంచాన్ని నేను మార్చాలనుకుంటే, ముందు నేను మారాలి. మనమే అన్ని పనులు చేసుకోవాలి. షెల్ఫ్‌లో ఉన్న దుమ్ము దులపాలి. మధ్యాహ్నం వరకు నిద్రపోతూ మనం చేయాలనుకుంటున్న లక్ష్యాల గురించి కలలు కనొద్దు’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది.

“సమంత పోస్ట్‌తో ఒంటిరిగా తన లక్ష్యాలను పూర్తి చేసుకోవాలని భావిస్తోంది.” అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఏది ఏమైనా తను అనుకుంటున్న లక్ష్యాలు చేరుకోవాలని, సమంతకు ఆల్‌ది బెస్ట్‌ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.