బిగ్ బాస్ లో ఏం జరిగింది: భార్యాభర్తల గొడవ.. నోరెళ్లబెట్టిన శ్రీముఖి.. ఏడ్చేసిన వరుణ్ సందేశ్

  • Published By: vamsi ,Published On : August 27, 2019 / 07:51 AM IST
బిగ్ బాస్ లో ఏం జరిగింది: భార్యాభర్తల గొడవ.. నోరెళ్లబెట్టిన శ్రీముఖి.. ఏడ్చేసిన వరుణ్ సందేశ్

ఇప్పటివరకు బిగ్ బాస్3 లో సంతోషాలు, సరదాలు, చిలిపి పనులు, అలకలు, గొడవలు, కోపాలు, చాడీలు అంటూ సాగిన బిగ్ బాస్ హౌస్ ఈ వారం మాత్రం కాస్త సీరియస్ గానే సాగేట్లు కనిపిస్తుంది. బిగ్ బాస్ రెండు సీజన్ల కంటే ఈ సీజన్ లో ఎప్పుడూ లేనివిధంగా వరుణ్ సందేశ్, వితికా షెరూ జంటను పంపించినపుడే ఏదో అవుతుందని ఊహించారు.

అయితే అందరూ అనుకున్న రేంజ్ లో మాత్రం ఇప్పటివరకు ఏమీ జరగలేదు. అయితే ఈ వారంలో ఇవాళ(27 ఆగస్ట్ 2019) లేటెస్ట్ గా విడుదలైన ప్రోమోలో మాత్రం ఈ ఇద్దరూ గొడవ పడుతున్నదే హైలైట్ చేస్తూ చూపించారు నిర్వాహకులు. భార్య వితికా షెరూతో కలిసి కావల్సినంత ఎంటర్ టైన్మెంట్ చేస్తున్న వరుణ్ సందేశ్ ప్రేక్షకుల్లో మంచి మార్కులు కొట్టేస్తున్నాడు.

అయితే లేటెస్ట్ గా విడుదలైన బిగ్ బాస్ ప్రోమో చూస్తే మాత్రం.. భార్యాభర్తలైన వరుణ్ సందేశ్, వితికా షెరూల మధ్య మాత్రం గొడవ గట్టిగానే జరిగినట్లుగా తెలుస్తుంది. నేనేం చేశాను.. ఎందుకలా బిహేవ్ చేస్తున్నావ్…? నువ్వు చాలా రూడ్ గా బిహేవ్ చేస్తున్నావ్? అంటూ వరుణ్ సందేశ్ వితికాని ప్రశ్నించగా.. నా దగ్గరకు రావద్దు అంటున్నా.. అంటూ వితికా ఆగ్రహం వ్యక్తం చేయడంతో వరుణ్ కూడా సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ గట్టిగానే జరిగినట్లుగా ప్రోమో చూస్తే తెలుస్తుంది.

నీ దగ్గరకు రావద్దు అంటే.. ఇంట్లో ఉండవద్దు అలాంటప్పుడు అంటూ వరుణ్ సందేశ్.. వితికాపై సీరియస్ అయ్యారు. ఏదైనా స్పోర్టీవ్ గా తీసుకో అంటూ చెబుతున్నప్పటికీ వితికా మాత్రం వినిపించుకోలేదు. ఈ క్రమంలోనే గార్డెన్ ఏరియాలోకి వెళ్లిన వరుణ్ సందేశ్.. ఎడుస్తూ కనిపించారు. ఏంటి ఇప్పుడు? అని ప్రశ్నించిన సమయంలో కూడా కాఫీ విసిరికొట్టాడు వరుణ్ సందేశ్. వీరిద్దరి మధ్య గొడవను చూసిన తోటి కంటెస్టెంట్ శ్రీముఖి నోరెళ్లబెట్టి కనిపించింది. చివరకు భార్యాభర్తల గొడవ ఏమయ్యిందో తెలుసుకోవాలంటే సాయంత్రం ప్రసారం అయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే.