కమిట్‌మెంట్ అంటే ఇదే: స్టేడియాన్నే ఇల్లుగా మార్చుకున్న హీరోయిన్

  • Published By: veegamteam ,Published On : November 6, 2019 / 05:21 AM IST
కమిట్‌మెంట్ అంటే ఇదే: స్టేడియాన్నే ఇల్లుగా మార్చుకున్న హీరోయిన్

హీరోయిన్లు అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిర్మాతలపై ఎక్కి కూర్చుంటారు అనే అభిప్రాయం ఉంది. అవుట్ లొకేషన్లకు వెళ్తే ఖరీదైన హోటళ్లు కావాలి. లగ్జరీ కార్లు కావాలి అని ఇబ్బంది పెట్టే హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. అయితే బాలీవుడ్ హీరోయిన్ పరిణతి చోప్రా మాత్రం సింప్లిసిటీతో అందరి ప్రశంసలు అందుకుంటుంది. 

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నేహ్వాల్ జీవితం చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతుంది. అమోల్ గుప్తే రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్‌ని ముందుగా టైటిల్ రోల్‌‌కి ఎంపిక చేశారు. అయితే అనారోగ్యంతో బాధప‌డుతున్న శ్ర‌ద్ధా  ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో ప‌రిణితీ చోప్రా చివరకు ఫ్రేంలోకి వ‌చ్చింది.

అయితే ప్రస్తుతం ప‌రిణితీ త‌న పాత్ర ప‌ర్‌ఫెక్ట్‌ గా ఉండేందుకు చాలా హార్డ్ వ‌ర్క్ చేస్తుంది. టైం వేస్ట్ అవ్వకూడదనే ఉద్ధేశంతో ముంబైలోని రామ్‌సేథ్ ఠాకూర్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియంలోనే నివాసం ఉంటూ మరి ప్రాక్టీస్ చేస్తుంది. నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా కమిట్‌మెంట్‌తో తన పాత్ర కోసం కష్టపడుతుంది. 

ఈ విషయాన్ని చిత్ర యూనిట్ గొప్పగా చెబుతుంది. ఇక వేగవంతంగా షూటింగ్ పూర్తి చేసి.. 2020లో సినిమా రిలీజ్ చేయ‌నున్నారు మూవీ యూనిట్. మరి ఈ సినిమా కోసం ఇంతగా.. హార్డ్ వర్క్ చేస్తున్న పరిణితో కష్టం ఫలిస్తుందో లేదో చూడాలి.