Yash: నిర్మాతగా మారుతున్న కేజీయఫ్ హీరో.. ఎవరి సినిమా చేస్తున్నాడో తెలుసా?
కన్నడ హీరో యశ్ ‘కేజీయఫ్’, ‘కేజీయఫ్-2’ సినిమాలతో పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. యశ్ ఇప్పటివరకు తన నెక్ట్స్ మూవీ ఏమిటనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.
Yash: కన్నడ హీరో యశ్ ‘కేజీయఫ్’, ‘కేజీయఫ్-2’ సినిమాలతో పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. ఈ సినిమాల్లో యశ్ చేసిన పవర్ప్యాక్డ్ పర్ఫార్మెన్స్కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలతో యశ్ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్నాడు. అప్పటివరకు కేవలం కన్నడ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అయిన ఈ హీరో, ఇక ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా క్రేజ్ను సొంతం చేసుకున్నాడు.
దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీయఫ్-2 సినిమాను 2022 ఏప్రిల్ 14న రిలీజ్ చేశారు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా తరువాత యశ్ ఇప్పటివరకు తన నెక్ట్స్ మూవీ ఏమిటనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. తన నెక్ట్స్ మూవీని త్వరలోనే అనౌన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాడు యశ్. అయితే, త్వరలోనే అనౌన్స్ చేయబోతున్న ఈ సినిమాతో ఆయన నిర్మాతగా మారుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
తన నెక్ట్స్ సినిమాను కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు యశ్ సిద్ధమవుతున్నాడట. ఈ క్రమంలోనే ఈ సినిమాను భారీ బడ్జెత్తో ప్రొడ్యూస్ చేసేందుకు ఆయన రెడీ అవుతున్నాడు. అయితే, ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తున్నారనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కాగా, ఈ సినిమాను ఏప్రిల్ 14న అనౌన్స్ చేయబోతున్నట్లుగా కన్నడ సినీ వర్గాలు అంటున్నాయి.