వ్యాక్సిన్ తీసుకున్న 26వేల మందికి కరోనా

కరోనా వ్యాక్సిన్​ మొదటి డోసు తీసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా సుమారు 21వేల మందికి, రెండో డోసు తీసుకున్న తర్వాత సుమారు ఐదున్నర వేల మందికి కరోనా సోకినట్లు బుధవారం కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది.

వ్యాక్సిన్ తీసుకున్న 26వేల మందికి కరోనా

Vaccination Corona

Covid-19  దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్​ మొదటి డోసు తీసుకున్న తర్వాత  21వేల మందికి పైగా, రెండో డోసు తీసుకున్న తర్వాత  ఐదున్నర వేల మందికి కరోనా సోకినట్లు బుధవారం కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం రెండు కరోనా వ్యాక్సిన్లు కోవాగ్జిన్,కోవిషీల్డ్ ఉపయోగంలో ఉన్న విషయం తెలిసిందే.

బుధవారం ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ మాట్లాడుతూ…ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 1 కోటీ 10లక్షల మందికి కొవాగ్జిన్ వ్యాక్సిన్లు అందించాం. మొదటి డోసు తీసుకున్న 93 లక్షల మందిలో 4వేల 208 మందికి కరోనా సోకింది. కొవాగ్జిన్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న 17 లక్షల 37 వేల 178 మందిలో 695 మందికి కరోనా సోకింది. మొత్తం సంఖ్యలో ఇది 0.04 శాతం మాత్రమేనని.. కొవాగ్జిన్ టీకా తీసుకున్న ప్రతి పదివేల మందిలో 2-4కి మాత్రమే కొవిడ్ సోకిందని తెలిపారు.

ఇక, కొవిషీల్డ్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా 11కోట్ల 60 లక్షల మందికి కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేశాం. వీరిలో 10కోట్ల మందికి మొదటిడోసు ఇచ్చాం. కొవిషీల్డ్ మొదటి డోసు తీసుకున్న వారిలో 17వేల 145 మందికి కరోనా సోకింది. కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్న 1 కోటీ 57 లక్షల 32 వేల 754 మందిలో.. 5 వేల 14 మంది వైరస్ బారిన పడ్డారు. మొత్తం సంఖ్యలో ఇది 0.03 శాతం. కొవిషీల్డ్ టీకా తీసుకున్న 10వేల మందిలో ఇద్దరికి మాత్రమే కరోనా సోకిందని బలరాం భార్గవ తెలిపారు. మొత్తంగా టీకా తీసుకున్న తర్వాత కరోనా బారినపడ్డ వారిసంఖ్య స్వల్పమేనని.. వేగంగా విస్తరించే కరోనా రెండో ఉద్ధృతిని పరిగణిస్తే సున్నా శాతంగా ఉంటుందని ఐసీఎంఆర్​ తెలిపింది. టీకాలు ఇన్‌ఫెక్షన్ తీవ్రతను తగ్గించి, పరిస్థితి విషమంగా మారకుండా చూస్తాయని ప్రాణాపాయాన్ని నివారిస్తాయని తెలిపింది.

Vaccine6