HS Doreswamy Covid : కరోనాను జయించిన ఫ్రీడమ్ ఫైటర్.. 103 ఏళ్ల హెచ్ఎస్ డొరేస్వామి కన్నుమూత
ప్రముఖ గాంధేయ, స్వాతంత్ర్య సమరయోధుడు 103 ఏళ్ల హెచ్ఎస్ డోరేస్వామి కరోనాను జయించారు. కానీ, ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
Freedom Fighter HS Doreswamy : ప్రముఖ గాంధేయ, స్వాతంత్ర్య సమరయోధుడు 103 ఏళ్ల హెచ్ఎస్ డోరేస్వామి కరోనాను జయించారు. కానీ, ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. బెంగుళూరు ఆస్పత్రిలో ఆయన గుండెపోటుతో మరణించినట్లు సన్నిహితులు వెల్లడించారు. భావ స్వేచ్ఛ కోసం పోరాడిన కన్నడ యోధుడిగా డోరేస్వామికి ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఐదు రోజుల క్రితం కరోనా లక్షణాలు కనిపించాయి.
అయినా ఎలాంటి సమస్యలు లేవు. శ్వాసకోశ సమస్యలు ఉన్నందున ఆస్పత్రిలో చేరారు. ప్రముఖ కార్డియాలజిస్ట్, మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ అల్లుడు జయదేవ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ సిఎన్ మంజునాథ్ వ్యక్తిగతంగా డొరేస్వామికి చికిత్సను పర్యవేక్షించారని ఆయనకు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 10, 1918 న జన్మించిన హరోహల్లి శ్రీనివాసయ్య డోరేస్వామి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు.
స్వాతంత్య్ర సంగ్రామంలో 1943 నుండి 1944 వరకు 14 నెలల జైలు శిక్ష అనుభవించారు. స్వాతంత్య్రానంతరం మైసూరు మహారాజాకు వ్యతిరేకంగా మైసూరు చలో ఉద్యమంలో గాంధీయులు పాల్గొన్నారు. బెంగళూరులోని సెంట్రల్ కాలేజీలో సైన్స్ బ్యాచిలర్ పూర్తిచేసిన ఆయన టీచింగ్ చేశారు.
యుక్తవయసులోనే ఆయన స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. తొలుత విప్లవ బాటలో సాగిన ఆయన ఆ తర్వాత గాంధీ బాటలో నడిచారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా మైసూర్ సామ్రాజ్యంలో ఆందోళనలు నిర్వహించారు. క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొన్నారు.