online game లో ఓడించిందని బాలికను హత్య చేసిన బాలుడు

  • Published By: madhu ,Published On : September 9, 2020 / 08:13 AM IST
online game లో ఓడించిందని బాలికను హత్య చేసిన బాలుడు

ఆన్ లైన్ గేమ్ బాలికను బలి తీసుకుంది. పదే పదే ఓడిస్తోందనే ఆగ్రహంతో 9 ఏళ్ల బాలికను 11 ఏళ్ల బాలుడు దారుణంగా చంపేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ చోటు చేసుకుంది. లాక్ డౌన్ ప్రారంభమైన్పప్పటి నుంచి వీరు ఆన్ లైన్ గేమ్ ఆడుతున్నారు.




మైనర్ బాలికను రాళ్లతో కొట్టాడని, తర్వాత వాష్ రూమ్ లో బంధించుకున్నాడని పోలీసులు తెలిపారు. Lasudia ప్రాంతానికి చెందిన ఓ బాలిక, బాలుడు ఆన్ లైన్ లో గేమ్స్ ఆడుతున్నారు. అయితే..తనను ఓడిస్తుందని బాలుడు ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో బాలికను చంపేయాలని నిర్ణయించుకున్నాడు.
https://10tv.in/mirchi-gang-gang-star-and-notorious-up-gangster-ashu-jaat-sells-fruits-in-mumbai-arrested/
పొలంలోకి తీసుకెళ్లి బాలిక తలపై, ముఖం రాళ్లతో దారుణంగా కొట్టడంతో అక్కడికక్కడనే కుప్పకూలిపోయింది. తర్వాత..ఆ బాలుడు ఇంట్లో ఉన్న బాత్ రూంలో బంధించుకున్నాడు. బాలిక కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు వెతికారు. పొలం వైపు వెళ్లడం చూశామని కొంతమంది చెప్పడంతో అక్కడకు వెళ్లారు. అక్కడ రక్తపుమడుగులో ఉన్న బాలిక కనిపించడంతో కుటుంసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.




ఈ క్రమంలో తమ కొడుకు కనిపించడం లేదని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లో తనిఖీలు చేయగా బాలుడు బాత్ రూంలో ఉన్నాడని తేలింది. అనంతరం తాను చంపేసినట్లు బాలుడు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.