ఓటు వేసిన ఢిల్లీ ఓల్డెస్ట్ ఓటరు

  • Published By: venkaiahnaidu ,Published On : May 12, 2019 / 06:07 AM IST
ఓటు వేసిన ఢిల్లీ ఓల్డెస్ట్ ఓటరు

ఢిల్లీలో ఓల్డెస్ట్ ఓటరు ఓటు వేశాడు.ఢిల్లీలోని తిలక్ విహార్ లోని పోలింగ్ బూత్ లో బచన్ సింగ్(111)ఇవాళ(మే-11,2019)ఉదయం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.2015ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వరకు బచన్ సింగ్ సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి ఓటు వేసేవారు.అయితే ఈసారి ఎన్నికల అధికారులతో కలిసి కారులో పోలింగ్ బూత్ కు వచ్చాడు.అక్కడ నుంచి వీల్ చైర్ లో వెళ్లి ఓటు వేశాడు.ప్రజలకు పనిచేసే వాళ్లకే తన ఓటు అని బచన్ సింగ్ తెలిపారు.అయితే ఢిల్లీలో ఆప్ పార్టీ ఉందని,అరవింద్ కేజ్రీవాల్ సీఎం అని బచన్ సింగ్ కు తెలియదు.ఆరోదశలో భాగంగా ఇవాళ ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్ సభ స్థానాల్లో పోలింగ్ జరగుతుంది.ఢిల్లీలోని మొత్తం లోక్ సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతుంది.