Covid Hospital Fire : బ్రేకింగ్.. మరో కోవిడ్ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. 12మంది రోగులు దుర్మరణం

కోవిడ్ ఆసుపత్రుల్లో వరుస అగ్నిప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే కొన్ని ఆసుపత్రుల్లో ప్రమాదాలు జరిగి కరోనా రోగులు చనిపోయారు. ఆ విషాదం నుంచి తేరుకోకముందే మరో కోవిడ్ ఆసుపత్రిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి రోగులు ప్రాణాలు కోల్పోయారు.

Covid Hospital Fire : బ్రేకింగ్.. మరో కోవిడ్ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. 12మంది రోగులు దుర్మరణం

Covid Hospital Fire

Covid Hospital Fire : కోవిడ్ కేర్ సెంటర్లు, ఆసుపత్రుల్లో వరుస అగ్నిప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే కొన్ని ఆసుపత్రుల్లో ప్రమాదాలు జరిగి కరోనా రోగులు చనిపోయారు. ఆ విషాదం నుంచి తేరుకోకముందే మరో కోవిడ్ ఆసుపత్రిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి రోగులు దుర్మరణం చెందారు.

గుజరాత్ రాష్ట్రంలో మరో కొవిడ్ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. భారుచ్ నగరంలోని వెల్ఫేర్ కోవిడ్ ఆసుపత్రిలో శనివారం(మే 1,2021) అర్థరాత్రి తర్వాత జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 12 మంది కరోనా రోగులు చనిపోయారు. వెల్ఫేర్ ఆసుపత్రిలో మంటలు చెలరేగగానే స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. మంటల్లో చిక్కుకున్న 50మంది రోగులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అగ్నిప్రమాదం వల్ల 12 మంది రోగులు మరణించారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భారుచ్ జిల్లా ఎస్పీ రాజేంద్ర చెప్పారు. ఎక్కువమంది దట్టమైన పొగతో ఊపిరాడక చనిపోయారని తెలిపారు.

భారుచ్ -జంబూసర్ జాతీయ రహదారిపై ఉన్న నాలుగు అంతస్తుల ఆసుపత్రిని ఓ ట్రస్టు నిర్వహిస్తోంది. అర్థరాత్రి 1 గంట సమయంలో గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు అంటుకున్నాయని అగ్నిమాపక శాఖ అధికారి శైలేష్ చెప్పారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే వచ్చామని, గంటలోపే మంటలను అదుపు చేశామని, 50 మంది రోగులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించామని అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. కాగా, అగ్నిప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. కోవిడ్ ఆసుపత్రుల్లో వరుస అగ్నిప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపుతున్నాయి.

మొన్నటికి మొన్న నాసిక్‌లోని జాకిర్ హుసేన్ ఆసుపత్రిలో ఆక్సిజన్ లీక్ కావడం వల్ల 24మంది కరోనా రోగులు మరణించారు. ఈ ఘటన నుంచి తేరుకోక ముందే.. మరో ప్రమాదం చోటు చేసుకుంది. పాల్‌ఘర్ జిల్లాలోని వసై-విరార్‌లో గల ఓ కోవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 12 మంది పేషెంట్లు మరణించారు.