150కిలోమీటర్లు నడిచిన 12ఏళ్ల బాలిక…ఇంటికి కొద్ది దూరంలో మృతి

  • Published By: venkaiahnaidu ,Published On : April 21, 2020 / 06:10 AM IST
150కిలోమీటర్లు నడిచిన 12ఏళ్ల బాలిక…ఇంటికి కొద్ది దూరంలో మృతి

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న వలసకార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో తమ స్వస్థలాలకు చేరుకునేందుకు వందల కిలోమీటర్లు కాలినడక కొనసాగిస్తున్నారు. కాగా,150కిమీ కాలినడకన ప్రయాణించి ఇంటికి ఇంకో గంటలో చేరుకోబోతున్న సమయంలో ఓ 12ఏళ్ల బాలిక మరణించింది.

జమ్లో మడ్కమ్ అనే 12ఏళ్ల బాలిక తన కుటుంబాన్ని పోషించేందుకు తెలంగాణలోని ఓ గ్రామంలో కూలీపనులు చేస్తుండేది. అయితే మళ్లీ లాక్ డౌన్ పొడిగిస్తారేమో అన్న ఆందోళనతో ఏప్రిల్-15న జమ్లో…తనతోటి పనిచేసే 11మందితో కలిసి తన స్వస్థలమైన చత్తీచత్తీస్ ఘడ్ లోని బీజాపుర్ జిల్లాకి చేరుకునేందుకు కాలినడక ప్రారంభించింది.

మూడు రోజుల పాటు అడవుల్లో గుండా 150కి.మీ వరకు ఈ గ్రూప్ కాలినడకతో ప్రయాణించారు. అయితే శనివారం(ఏప్రిల్-18,2020)మధ్యాహ్నాం ఇంటికి ఇంకో 14కిలోమీటర్లు దూరంలో ఉండగా,జమ్లోకి తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. కొద్దిసేపటికే కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయింది. జమ్లో బాడీని అంబులెన్స్ లో తన సొంతవూరికి ఆ గ్రూప్ చేర్చింది.

అయితే తీవ్రమైన డీహైడ్రేషన్,పోషకాహార లోపంతో జమ్లో బాధపడినట్లు డాక్టర్లు తెలిపారు. జమ్లోకి కరోనా టెస్ట్ లు కూడా నిర్వహించారు. టెస్ట్లో జమ్లోకి కరోనా నెగిటివ్ వచ్చింది. జమ్లో…తన శరీరంలోని ఎలక్టోరైట్ అసమతుల్యత కారణంగా కూడా బాధపడి ఉండవచ్చని బీజాపుర్ సీనియర్ డిస్ట్రిక్ మెడికల్ ఆఫీసర్ బీఆర్ పుజారి తెలిపారు.

రెండు నెలలుగా తన కూతురు తెలంగాణలో పనిచేస్తూ ఉందని జమ్లో తండ్రి ఆండ్రమ్ మడ్కమ్ తెలిపారు. వాంతులు,కడుపునొప్పితో బాధపడిందని ఆయన తెలిపారు. జమ్లో సరిగా తిండి తనలేదని తనతో వచ్చిన గ్రూప్ సభ్యులు తెలిపారని ఆయన చెప్పారు. జమ్లో కుటుంబానికి 1లక్ష రూపాయల పరిహారాన్ని చత్తీస్ ఘడ్ ప్రభుత్వం ప్రకటించింది.